AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఓ షాపు దగ్గరకు రాగానే.. పేపర్ బాయ్‌కి కనిపించిన షాకింగ్ దృశ్యం.. కట్ చేస్తే.!

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. వాసవి జ్యూయెలర్స్ దుకాణంలో షెటర్‌ తాళాలు పగులగొట్టి బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు.

Ravi Kiran
|

Updated on: Apr 15, 2024 | 12:03 PM

Share

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. వాసవి జ్యూయెలర్స్ దుకాణంలో షెటర్‌ తాళాలు పగులగొట్టి బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. దాదాపు అరకిలో బంగారం, రెండు కిలోల వెండితోపాటు నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు బాధితుడు. చోరీ అయిన సొత్తు విలువ 40 లక్షలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు.

నిద్రిస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు..

మరోవైపు ఆత్మకూరు మండలంలో శుక్రవారం నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు ఆభరణాల చోరీ సంఘటన చోటు చేసుకుంది. డాబాపై అర్ధరాత్రి నిద్రిస్తున్న ఓ మహిళ మెడలో నుంచి సుమారు 6.75 తులాల బంగారు పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు తీసుకుని ఉడాయించాడు ఒక ఆగంతకుడు. ఉదయం మేల్కొన్న ఆమెకు మెడలో ఆభరణాలు కనిపించకపోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.