Telangana: సెక్యూరిటీ ఇస్తామంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్
వరంగల్ ప్రజలకు ఘరానా దొంగల భయం పట్టుకుంది. నిర్మాణంలో ఉన్న భవనాలే వారి టార్గెట్. దొరికినకాడికి దొరికినట్టు దోచేస్తున్నారు. తాజాగా అదే తరహ ఘటన ఒకటి వరంగల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? లేట్ ఎందుకు..
వరంగల్లో ఘరానా దొంగలు హల్చల్ చేస్తున్నారు. పెద్దమ్మగడ్డ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అపహరించారు. తమను ఇంటి యాజమాని పంపాడని సెక్యూరిటీ సిబ్బందిని నమ్మించి.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డు కాగా.. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు ఇంటి యజమాని. కాగా, నిర్మాణంలో ఉన్న ఇళ్లలో ఇలా చోరీలకు పాల్పడి ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ ముఠా అమ్ముకుంటోందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
Follow Us
వైరల్ వీడియోలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

