లోను కట్టలేదని రంగంలోకి బ్యాంక్ మేనేజర్.. వచ్చి ఏకంగా దాన్నే ఎత్తుకుపోయారు
బ్యాంకులు తమ ఖాతాదారులకు రకరకాల లోన్లు ఇస్తుంటారు. తిరిగి వాటిని తమ ఏజెంట్లద్వారా వసూలు చేయిస్తుంటారు. అయితే ఓ కస్టమర్ లోను తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో డైరెక్టుగా బ్యాంక్ మేనేజరే రంగంలోకి దిగాడు. లోను వసూలు చేసుకోడానికి కస్టమర్ ఇంటికి వెళ్లిన బ్యాంక్ మేనేజర్ అక్కడ చేసిన పనికి అంతా మండిపడుతున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరిలపాడు తండాకు చెందిన బానోత్ లింగా అనే యువకుడు కూసుమంచి లోని డీసీసీబి బ్యాంకులో ముద్రా లోన్ తీసుకున్నాడు. వాటితో మైక్రో ఫైనాన్స్ ద్వారా వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ఇప్పిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో అతని ఇంట్లోని కుటుంబ సభ్యులకు అనారోగ్యం చేయడంతో డబ్బులు సర్దుబాటుకాక 6 నెలలుగా బ్యాంకు లోను ఈఎంఐ చెల్లించడంలేదు. దీంతో బ్యాంక్ మేనేజర్ సిబ్బందిని వెంటపెట్టుకొని లింగా ఇంటికి వెళ్లి లోను కట్టమని అడిగాడు. లింగా తన పరిస్థితి వివరించి గడువు కోరాడు. అందుకు ససేమిరా అన్న బ్యాంకు మేనేజర్ అప్పుకింద లింగా పెంచుకుంటున్న గొర్రెలను తీసుకెల్లిపోయాడు. దీంతో బాధితుడు మరోచోట అప్పు చేసి 10వేల రూపాయిలు కట్టడంతో గొర్రెలను బాధితుడు ఇంటికి తరలించారు. డీసీసీబీ మేనేజర్ నిర్వాకం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
dilsukhnagar bomb blast: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?

