
కర్నూలు బస్సు అగ్నిప్రమాద విషాదంలో తన కుమార్తె అనూషను కోల్పోయిన తండ్రి తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి తన బిడ్డతో ఫోన్లో చివరిసారిగా మాట్లాడిన క్షణాలను ఆయన పంచుకున్నారు. ఉదయం వార్తల్లో బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై 40 మంది మరణించారని తెలియడంతో గుండె పగిలిందన్నారు. అనంతరం వార్తల్లో బస్సు నంబరు (DD 01, 9490) చూసి షాక్కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత టీవీలో మృతుల పేర్లలో శ్రుతి తర్వాత తన కుమార్తె అనూష పేరు విని మరింత కుంగిపోయారు.
మరిన్ని వీడియోల కోసం :