ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 ఏళ్ల శివశంకర్ మృతి చెందాడు. కావేరీ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. చిన్ననాటనే తండ్రిని కోల్పోయిన శివశంకర్, గ్రానైట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొడుకును కోల్పోయిన తల్లి, కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.
కర్నూలు జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. వేకువ జామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్తున్న బైకును ఢీకొనడంతో శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో శివశంకర్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గ్రానైట్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న 21 ఏళ్ల శివశంకర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. చేతికి వచ్చిన కొడుకు దూరం కావడంతో తల్లి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆసుపత్రి మార్చురీ వద్ద కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కొడుకు తమకు దూరమయ్యాడని జీర్ణించుకోలేక పోయారు.
మరిన్ని వీడియోల కోసం :
తాతని.. అని చెబితే పంపేస్తారా? వీడియో
స్మృతి ఇరానీ సీరియల్లో బిల్గేట్స్ వీడియో
బ్యాంకులో మోగిన అలారం.. దొంగలు పరార్ వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
