AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వర్షంలో వందే భారత్ వీరంగం.. నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన దృశ్యం వైరల్!

సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.. భారీ వర్షాలతో చాలా చోట్ల రైల్వే పట్టాలపై నీరు చేరింది. అలాంటి సమయంలో వరద నీటితో నిండిపోయిన పట్టాలపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకెళ్లిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రైలు వేగంగా వెళ్లడంతో పట్టాలపై నిలిచిన నీరు భారీగా పైకి ఎగిసిపడింది. ఆ నీరు పక్కనే ఉన్న ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కార్లు, ఇతర వాహనాల పై ఎగిసిపడ్డాయి. ఈ దృశ్యం చూసిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

భారీ వర్షంలో వందే భారత్ వీరంగం.. నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన దృశ్యం వైరల్!
Flooded Railway Tracks
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 05, 2026 | 11:56 AM

Share

ముంబై నగరంలో కురిసే భారీ వర్షాలు, దానివల్ల తలెత్తే రవాణా ఇబ్బందులు అందరికీ తెలిసినవే. కొద్దిపాటి వర్షానికే అక్కడి లోకల్ రైలు పట్టాలు, రోడ్లు జలమయం అవుతుంటాయి. అయితే, తాజాగా ముంబైలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన, అదే సమయంలో కాస్త ప్రమాదకరమైన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాంజూర్‌మార్గ్ (Kanjurmarg) సమీపంలో వరద నీటితో నిండిపోయిన రైల్వే పట్టాలపై దేశీయ సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా దూసుకెళ్లిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

సినిమా సీన్‌ను తలపిస్తున్న దృశ్యం:

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రైల్వే పట్టాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో రైళ్లను నిలిపివేయడం లేదా చాలా నెమ్మదిగా నడపడం చేస్తుంటారు. కానీ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా నీటిని చీల్చుకుంటూ వేగంగా ముందుకు సాగింది. రైలు వేగానికి పట్టాలపై నిలిచిన వరద నీరు రెండు వైపులా భారీ ఫౌంటెన్‌లా పైకి ఎగిసిపడింది. ఆ నీటి ధారలు ఎంత ఎత్తుకు లేచాయంటే, పక్కనే ఉన్న ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలపై ఆ నీరు జలపాతంలా పడింది. ఈ విజువల్స్ చూస్తుంటే ఏదో హై-బడ్జెట్ యాక్షన్ సినిమాలోని గ్రాఫిక్స్ సీన్‌లా కనిపిస్తోంది.

నెటిజన్ల కామెంట్ల వర్షం:

ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నిజంగా భారతీయ రైల్వే పవర్.. వందే భారత్ దూసుకెళ్లిన తీరు అద్భుతంగా ఉంది అని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇంత భారీగా నీరు ఉన్నప్పుడు అంత వేగంగా వెళ్లడం ప్రమాదకరం కాదా? ట్రాక్ లేదా రైలు ఇంజన్ దెబ్బతినే అవకాశం ఉంది కదా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

నిజమెంత?:

ఈ వీడియో ప్రస్తుతం ముంబైలో కురుస్తున్న వర్షాల సమయంలోనే చిత్రీకరించినట్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వీడియో ఎంతవరకు నిజం? ఇది ఇటీవల జరిగిన ఘటనేనా లేక పాత వీడియోనా అనే విషయంపై రైల్వే శాఖ లేదా స్థానిక అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏది ఏమైనప్పటికీ, నీటి అలలను చీల్చుకుంటూ బుల్లెట్‌లా దూసుకెళ్లిన వందే భారత్ విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us