AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎవర్రా మీరంతా.! ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ఆర్టీసీ బస్సు చేసేశారుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వడం పక్కా..

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో గురించి చర్చ జరుగుతోంది. దీనిలో గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రయాణీకులు తమ ప్రాణాలతో తామే చెలగాటం ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసినప్పుడు.. అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు అసలు ఇలా ఎలా చేయగలరు అంటూ ఆశ్చర్యపోయారు.

Viral Video: ఎవర్రా మీరంతా.! ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ఆర్టీసీ బస్సు చేసేశారుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వడం పక్కా..
Viral VideoImage Credit source: Social Media
Surya Kala
|

Updated on: Sep 02, 2025 | 10:51 AM

Share

ప్రయత్నం సురక్షితంగా సుఖవంతంగా సాగాలంటే.. ప్రతి ఒక్కరూ నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రయాణించాలి. అప్పుడే రైలు, బస్సు, బైక్ ఏ ప్రయాణం అయినా సురక్షితంగా ఉంటుంది. రైలులో లేదా బస్సులో రద్దీ ఉన్నప్పుడు తలుపు దగ్గర వేలాడుతూ, పైకప్పుపైకి ఎక్కడం వంటి అజాగ్రత్త చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితం కాదు. అయితే ప్రజలు ఈ విషయాలను పట్టించుకోరు. ఎక్కడైనా కూర్చుని తమ గమ్య స్థానం చేరుకోవాలని భావిస్తారు. అందుకోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దాన్ని చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక క్షణం ఆశ్చర్యపోతారు.

ఇటీవల ప్రతి ప్రేక్షకుడి మనసుని వణికించే ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ క్లిప్‌లో ప్రయాణీకులు ప్రయాణించే విధానం చూస్తే ఒక క్షణం వణికిపోతారు. ప్రాణం విలువ ఇంత చౌకగా ఉందా అని మీరు ఒక్క క్షణం ఆలోచించడం ప్రారంభిస్తారు? ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. అసలు ఈ దృశ్యం ఊహకు అతీతమైనది. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి

వీడియోలో కదులుతున్న రైలు పైకప్పుపై ఒక జనసమూహం సంతోషంగా ప్రయాణిస్తున్నట్లు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తులు సాధారణ రీతిలో కూర్చోలేదు.. తలక్రిందులుగా పడుకున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే, కొంతమంది ఒకరిపై ఒకరు ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. రైలు ఎత్తు తక్కువగా ఉన్న వంతెన కింద నుంచి వెళ్తున్న సమయంలో పైకప్పుపై పడుకున్న వారందరూ గోడను ఢీకొట్టకుండా ఉండటానికి వెంటనే వారి తలలు, శరీరాలను పూర్తిగా దగ్గరకు చేసుకున్నాడు. ఆ క్షణం చుస్తున్నవారికి గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే రైలు పైకప్పు, వంతెన మధ్య చాలా తక్కువ స్థలం ఉంది. ఒక చిన్న పొరపాటు మరణాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది.

ఈ వీడియో @mb.mohiuddin.927 అనే ఖాతా నుంచి ఇన్‌స్టాలో షేర్ చేయబడింది. ఇప్పటికే వేలాది మంది దీనిని చూశారు. రకరకాల కామెంట్స్ తో తమ ప్రతిచర్యలను తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు, సోదరా.. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజల జీవితాలు .. వారి ప్రాణాలు ఇంత చౌకగా అనిపిస్తున్నాయని రాశారు. మరొకరు ఈ వ్యక్తులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని రాశారు. మరొకరు, గమ్యాన్ని చేరుకోవడం కోసం మరణంతో ఆడుకోవడం అవసరమా? అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..