AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్షణం ఆలస్యం అయితే ప్రాణాలు గాలిలో కలిసేవే.. కదులుతున్న రైలు ఎక్కుతూ ..

ఓ ప్రయాణీకుడు రైలు ఎక్కేందుకు చేసిన ప్రయత్నం ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Viral Video: క్షణం ఆలస్యం అయితే ప్రాణాలు గాలిలో కలిసేవే.. కదులుతున్న రైలు ఎక్కుతూ ..
Viral Video
Surya Kala
|

Updated on: Sep 12, 2022 | 4:02 PM

Share

Viral Video: కదులుతున్న రైళ్లు నుంచి ప్రయాణీకులు ఎక్కడం, దిగడం ప్రమాదకరం రైల్వే అధికారులు, సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ చాలామంది  ప్రయాణీకులు ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రయాణీకుడు రైలు ఎక్కేందుకు చేసిన ప్రయత్నం ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఘజియాబాద్‌లో రైల్వే స్టేషన్​లో ఓ వ్యక్తి  రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ.. పట్టుదప్పి.. జారి పడిపోయాడు.. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు అతడిని రక్షించాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడిన వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. కదులుతున్న పూర్ణగిరి జనశతాబ్ది రైలు ఎక్కేందుకు వ్యక్తి ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన అంతా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

ఇవి కూడా చదవండి

రైల్వే స్టేషన్‌లో సీసీటీవీలో రికార్టైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ASI రాజేంద్ర సింగ్ వేగంగా స్పందించి చాకచక్యంగా ఆ వ్యక్తి ట్రాక్‌ పై పడకుండా కాపాడిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ASI రాజేంద్ర సింగ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..