AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost Marriage: మరణించిన జంటకు పెళ్లి చేసిన ఫ్యామిలీ.. హృదయాన్ని కదిలించే ప్రేమికుల స్టోరీ..

మలేషియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ అనే జంట మరణించారు. ఈ సంఘటన మే 24న పెరాక్‌లోని వాయువ్య ప్రాంతంలో జరిగింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. లీకి తనను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయడానికి జింగ్‌షాన్ తన పుట్టినరోజుని ఎంచుకున్నాడు. ఈ మేరకు బ్యాంకాక్‌కు వెళ్లాలని ప్లాన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే దురదృష్టం ఈ జంటను వెంటాడింది

Ghost Marriage: మరణించిన జంటకు పెళ్లి చేసిన ఫ్యామిలీ.. హృదయాన్ని కదిలించే ప్రేమికుల స్టోరీ..
Ghost Marriage
Surya Kala
|

Updated on: Jun 20, 2024 | 6:35 PM

Share

చనిపోయిన వ్యక్తులకు పెళ్లి చేయడం అన్న సంప్రదాయం మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా జరిగిన సంఘటనతో కొన్ని దేశాల్లో కూడా మరణించిన వ్యక్తులకు కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తారని తెలుస్తోంది. తాజాగా ప్రమాదంలో ఒకే సారి మరణించిన యువతీ యువకుడికి ఆ రెండు కుటుంబ సభ్యులు కలిసి ఆచార సాంప్రదాయాల ప్రకారం వివాహం చేశారు. ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మలేషియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ అనే జంట మరణించారు. ఈ సంఘటన మే 24న పెరాక్‌లోని వాయువ్య ప్రాంతంలో జరిగింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. లీకి తనను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయడానికి జింగ్‌షాన్ తన పుట్టినరోజుని ఎంచుకున్నాడు. ఈ మేరకు బ్యాంకాక్‌కు వెళ్లాలని ప్లాన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే దురదృష్టం ఈ జంటను వెంటాడింది. అతను తన ప్రేమని వెల్లడించి పెళ్లి చేసుకోమని అడిగే లోపు కారు ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఇప్పుడు ఈ లోకంలో లేరు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదం తర్వాత, రెండు ఇళ్లలోని కుటుంబాలు కలిసి ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. తమ పిల్లల ఆఖరి కోరిక తీర్చేందుకు వారు ‘ప్రేత వివాహం’ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఇది చైనాలో ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయంలో ఇద్దరు పెళ్లికాని వ్యక్తులు చనిపోతే వారి ఆత్మలను వివాహం అనే పవిత్ర బంధంలో ఒకటి చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన తర్వాత కూడా ఇద్దరూ భార్యాభర్తలుగా కలకాలం ఉంటారని.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం.

జింగ్షాన్ , లీ కుటుంబాలు గత సోమవారం అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన హాలులో ఈ ప్రత్యేకమైన వివాహ వేడుకను నిర్వహించాయి. ఇక్కడ మృతులైన యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ లకు వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుక కోసం కుటుంబ సభ్యులు పెళ్లి ఫొటో కూడా తయారు చేశారు. జింగ్‌షాన్ కుటుంబం తమ సంతాప సందేశంలో లిని తమ కోడలుగా అంగీకరించింది.

మృతులకు పెళ్లి చేసే ఆచారం చైనాలోనే కాదు, ఈ దేశాల్లో కూడా ఉంది

చైనీస్ జానపద నిపుణుడు హువాంగ్ జింగ్‌చున్ మాట్లాడుతూ.. ఇలా మరణించిన వ్యక్తులకు పెళ్లి చేసే సాంప్రదాయం ప్రియమైన వారిని కోల్పోయిన బంధువుల భావోద్వేగాలను తీర్చడంలో సహాయపడుతుంది. చైనీస్ సంస్కృతి ప్రభావంతో ఉత్తర కొరియా , జపాన్ వంటి అనేక తూర్పు ఆసియా దేశాలలో కూడా ఇలా ఆత్మలకు వివాహ చేసే ఆచారం ప్రబలంగా ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..