AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘అలా వచ్చిన అతిథులకే వింధు భోజనం పెట్టండి..’ నూతన వధూవరుల క్రేజీ రూల్.. అందరూ షాక్

కరోనా కబళిస్తున్నవేళ మాస్కు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి. మాస్కులు పెట్టుకోకుంటే పోలీసులు ఫైన్లు వేస్తున్నారు. డాక్టర్లు అయితే డబుల్ మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

Viral Video: 'అలా వచ్చిన అతిథులకే వింధు భోజనం పెట్టండి..' నూతన వధూవరుల క్రేజీ రూల్.. అందరూ షాక్
Representative image
Ram Naramaneni
|

Updated on: Jan 24, 2022 | 11:10 AM

Share

కరోనా కబళిస్తున్నవేళ మాస్కు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి. మాస్కులు పెట్టుకోకుంటే పోలీసులు ఫైన్లు వేస్తున్నారు. డాక్టర్లు అయితే డబుల్ మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాట వినూత్న రీతిలో నిశ్చితార్థం చేసుకుంది ఓ కొత్త జంట. అంతేకాదు, వీరికి నిశ్చితార్థానికి వచ్చిన బంధువులకు కూడా వెరైటీ శరతు విధించారు. చదువుకున్నవారు కాబట్టి కాస్త పరిణితితో ఆలోచించారు.  చెన్నై శివార్లలోని పూనమలిలోని కల్యాణమండపంలో మేరీ, వివేక్‌ల నిశ్చితార్థం జరిగింది. ఫంక్షన్ కి వచ్చే వారందరికీ కరోనా నిబంధనలు వర్తించేలా వినూత్నంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలో భాగంగా వధూవరులు పూలదండలు కాకుండా మాస్కులతో తయారు చేసిన దండలు వేసుకున్నారు. పైగా ఫంక్షన్‌కు అటెండ్‌ అయినవారిలో వ్యాక్సినేషన్ కంప్లీట్ అయినట్లు సర్టిఫికెట్ ఉన్నవారికీ మాత్రమే వింధు భోజనం, బిర్యానీ వడ్డించాలని నిబంధన పెట్టారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్‌ మీడియాలో చేరింది. వీరి నిశ్చితార్థం వీడియోలో వైరల్‌ అవుతున్నాయి. కొత్త జంట తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినంధిస్తున్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ అందరూ ఈ పద్దతి ఫాలో అయితే బెటర్ అని సూచిస్తున్నారు.

Also Read: Anantapur district: రూపాయికే దోసె.. సావిత్రమ్మా.. నీ మనసు ఎంత గొప్పది అమ్మా..!

Viral: రైతా.. మజాకా..! కారు రూ.10 కాదంటూ అవమానించిన సేల్స్​మ్యాన్​.. గంటలో దిమ్మతిరిగే షాక్