Watch: మరో పాటకు స్టెప్పులేసిన పాకిస్థానీ అమ్మాయి.. ‘మెరా దిల్ యే పుకారే’ తర్వాత మళ్లీ ఇలా.. వైరల్ అవుతున్న వీడియో..

ఇండియన్ మ్యూజిక్‌‌ని నిజానికి ఇండియన్ మ్యాజిక్ అనాలి. ఎందుకంటే మన పాటలు విన్న విదేశీయలు ఎవరైనా కాలు కదపకుండా ఉండలేరు. ఇక మన సినిమా పాటలకు స్టెప్స్ వేసి సోషల్ మీడియాలో..

Watch: మరో పాటకు స్టెప్పులేసిన పాకిస్థానీ అమ్మాయి.. ‘మెరా దిల్ యే పుకారే’ తర్వాత మళ్లీ ఇలా.. వైరల్ అవుతున్న వీడియో..
Pakistani Girl Ayesha Danced To A Haryanvi Song
Follow us

|

Updated on: Dec 29, 2022 | 5:42 PM

ఇండియన్ మ్యూజిక్‌‌ని నిజానికి ఇండియన్ మ్యాజిక్ అనాలి. ఎందుకంటే మన పాటలు విన్న విదేశీయలు ఎవరైనా కాలు కదపకుండా ఉండలేరు. ఇక మన సినిమా పాటలకు స్టెప్స్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు విదేశీయులు. ఆ క్రమంలోనే అస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్ వీడియోలు కూడా మీకు గుర్తుండే ఉంటాయి. ఇక ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌కు చెందిన ఆయేషా అనే యువతి దివంగత గాయకురాలు లతా మంగేష్కర్ పాడిన ‘మెరా దిల్ యే పుకారే ఆజా’ పాటకు స్టెప్పులేసి ఎంటైర్ సోషల్ మీడియానే ఊపేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆయేషా మరో పాటకు స్టెప్పులేసింది. ప్రాంజల్ దహియా, ఉపాసనా గెహ్లాట్ కలిసి పాడిన ‘తేరే చక్కర్ మే’ అనే పాటకు స్టెప్పులేసిన ఆయేషా మరోసారి నెట్టింట సంచలనం సృష్టించింది. మేరా దిల్ యే పుకారే ఆజా పాట మాదిరిగానే ఈ పాటను కూడా నెటిజన్లు ఇష్టపడుతున్నారు. ఆ కారణంగానే ఈ తేరే చక్కర్ మే పాటకు సంబంధించిన తన వీడియోను ఆయేషా పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు లక్ష 54 వేల మంది లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఆయేషా వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by AYESHA (@oyee_ayesha)

అలాగే దాదాపు 11 లక్షలకు పైగా వీక్షణలు కూడా వచ్చాయి. ఆ క్రమంలోనే ఒక నెటిజన్ ‘మీ డ్యాన్స్ అద్భుతంగా ఉంది. ఈ సెల్వార్‌లో నువ్వు బాగా కనిపిస్తున్నావు’ అని కామెంట్ చేయగా, ‘మీరు అందంగా ఉన్నారు.మీ హావభావాలు కూడా బాగున్నాయ’ని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలకు కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.