AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: విండో షాపింగ్ చేసి వెళ్తున్న పర్యాటకులను బంధించిన షాప్ యజమాని .. ఎక్కడంటే..

దుకాణంలో వస్తువులను చూసి పర్యాటకులు బయలుదేరడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ షాప్ గార్డులు పర్యాటకులను చుట్టుముట్టారు. ఈ సమయంలో  ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గార్డులతో వాదించిన కొంతమంది పర్యాటకులు అలసిపోయి పరుపులపై కూర్చొని కనిపించారు. అదే సమయంలో అక్కడ ఒక పర్యాటకుడు వీడియోలు చేయడం ప్రారంభించాడు. అందులోంచి మేము శిషుంగ్‌బన్నా నగరంలోని పరుపులు అమ్ముతున్న దుకాణంలో నిలబడి ఉన్నామని చెప్పడం వినిపిస్తుంది.

China: విండో షాపింగ్ చేసి వెళ్తున్న పర్యాటకులను బంధించిన షాప్ యజమాని .. ఎక్కడంటే..
China Shopkeeper Captive Tourist
Surya Kala
|

Updated on: Apr 13, 2024 | 10:05 AM

Share

దుకాణదారుడు తన వస్తువులను ఎలాగైనా విక్రయించాలనే ఆలోచనలో ఉంటాడు. ఇందు కోసం షాప్ యజమాని కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తాడు. అయితే చైనాలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. పర్యాటకులు ఒక పరుపుల దుకాణానికి వెళ్లారు.. అక్కడ షాప్ లో ఉన్న వస్తువులను చూసి  అక్కడ ఏమీ కొనలేదు. దీంతో 37 మంది పర్యాటకులను ఆ దుకాణంలో బందీలుగా పట్టుకున్నారు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది పూర్తిగా నిజం.

ఈ సంఘటన మార్చి 26, 2024 న యునాన్ ప్రావిన్స్‌లోని షిషుంగ్‌బన్నా నగరంలో జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనకు సంబంధించిన ఫోటో-వీడియోలు ఇప్పుడు చైనా సోషల్ మీడియా సైట్ వీబోలో వైరల్ అవుతున్నాయి. విషయం వెలుగులోకి రావడంతో నిర్వాహకులు దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పాటు పర్యాటకులను షాపుకు తీసుకొచ్చిన టూర్‌ గైడ్‌కు రూ.1లక్ష 18వేలు జరిమానా విధించారు. పర్యాటకులు దుకాణంలోకి ప్రవేశించి పరిశీలించినా అక్కడ కొనుగోళ్లు చేయకపోవడంతో వారిని బందీలుగా ఉంచినట్లు నివేదికలో పేర్కొన్నారు.

అక్కడ ఏం జరిగిందంటే

‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. దుకాణంలో వస్తువులను చూసి పర్యాటకులు బయలుదేరడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ షాప్ గార్డులు పర్యాటకులను చుట్టుముట్టారు. ఈ సమయంలో  ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గార్డులతో వాదించిన కొంతమంది పర్యాటకులు అలసిపోయి పరుపులపై కూర్చొని కనిపించారు. అదే సమయంలో అక్కడ ఒక పర్యాటకుడు వీడియోలు చేయడం ప్రారంభించాడు. అందులోంచి మేము శిషుంగ్‌బన్నా నగరంలోని పరుపులు అమ్ముతున్న దుకాణంలో నిలబడి ఉన్నామని చెప్పడం వినిపిస్తుంది. మాలో 37 మందిని బయటకు వెళ్లనివ్వకుండా దుకాణంలో బందీగా చేశారు. మేము మధ్యాహ్నం ఇక్కడకు వచ్చాము.. ఇప్పుడు సాయంత్రం అయ్యిందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

అయితే చైనాలో వస్తువులను కొనుగోలు చేయనందుకు పర్యాటకులతో అసభ్యంగా ప్రవర్తించడం ఇది మొదటి కేసు కాదు. ఇంతకు ముందు కూడా జరిగిన ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చైనీస్ షాపులో కస్టమర్లు కొనకపోవడంతో అక్కడున్న దుకాణదారు వారితో వాగ్వాదానికి దిగడం సర్వసాధారణం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..