AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ.225 కోట్ల జాక్ పాట్ తగిలింది..

కొందరు కళ్లు మూసుకుని తాము అనుకున్నది జరగాలని మొక్కుతుంటారు.. అలాంటిదే ఒక అలవాటుతో చేసిన పని ఒక మిడిల్‌ క్లాస్‌ ఉద్యోగి తలరాతను మార్చేసింది.. రాత్రికి రాత్రే అతన్ని కోటీశ్వరుడిగా మార్చేసింది. కోటీశ్వరుడు అంటే.. అదేదో రెండు మూడు కోట్ల రూపాయలు కాదు.. ఏకంగా రూ.225కోట్లు తెచ్చిపెట్టింది.. ఇంతకీ అసలు విషయం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే...

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ.225 కోట్ల జాక్ పాట్ తగిలింది..
Sriram Rajagopalan
Jyothi Gadda
|

Updated on: May 25, 2025 | 6:44 PM

Share

సాధారణంగానే చాలా మంది కొన్ని వింత ఆటలు అలవాటుగా ఉంటాయి. కొందరు దూరంగా ఉన్న కప్పులో రాళ్లు వేస్తూ మనసులో తమ కోరికలు చెప్పుకుంటారు.. అలాగే, కొందరు చేతి వేళ్లను తాకితే తమ కోరిక తీరుతుందో లేదో పరీక్షించుకుంటారు. అలాగే, ఇంకొందరు కళ్లు మూసుకుని తాము అనుకున్నది జరగాలని మొక్కుతుంటారు.. అలాంటిదే ఒక అలవాటుతో చేసిన పని ఒక మిడిల్‌ క్లాస్‌ ఉద్యోగి తలరాతను మార్చేసింది.. రాత్రికి రాత్రే అతన్ని కోటీశ్వరుడిగా మార్చేసింది. కోటీశ్వరుడు అంటే.. అదేదో రెండు మూడు కోట్ల రూపాయలు కాదు.. ఏకంగా రూ.225కోట్లు తెచ్చిపెట్టింది.. ఇంతకీ అసలు విషయం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే…

చెన్నైకి చెందిన ఒక రిటైర్డ్ ఇంజినీర్ కళ్లు మూసుకొని కొట్టిన నెంబర్లు అతనికి రూ.225 కోట్లు వచ్చి పడేలా చేసింది. దీంతో అతడు తనకు వరించిన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు. ఇది నిజంగానే జరిగిందా..? అనే ఆశ్చర్యంలో ఉండిపోయాడు. చెన్నైకి చెందిన రిటైర్డ్ ఇంజినీర్ శ్రీరామ్ రాజగోపాలన్‌ను అనుకోని అదృష్టం వరించింది. యూఏఈకి చెందిన ‘ఎమిరేట్స్ డ్రా’లో ఏకంగా రూ.225 కోట్ల జాక్‌పాట్ కొట్టారు.

శ్రీరామ్ రాజగోపాలన్‌కు ఒక సాధారణ ఫోన్ ట్యాప్ అలవాటు ఉండేది. అలాంటి అలవాటే అతడి తలరాతను మార్చివేసింది. యుఎఈ లాటరీ చరిత్రలో ఒక భారతీయుడు ఇంతటి భారీ బహుమతి గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ఎమిరేట్స్ డ్రా సంస్థ మే 22 గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. కాగా, శ్రీరామ్ 1998లో సౌదీ అరేబియాకు వెళ్లి స్థిరపడ్డారు. 2023లో రిటైరై ఇండియాకు వచ్చేశారు. భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. మార్చి 16న తన పుట్టినరోజు సందర్భంగా లాటరీ టికెట్ కొన్నానని, ఇంత భారీ మొత్తం వస్తుందని ఊహించలేదని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

డాలర్లలో లాటరీ గెలిచిన శ్రీరామ్, తన గెలుపులో కొంత భాగాన్ని ఛారిటీకి విరాళంగా ఇస్తానని చెప్పాడు. ఇది నా కుటుంబానికి ఆశను ఇచ్చింది. ఈ డబ్బు పిల్లల భవిష్యత్తుకు దృఢమైన పునాది వేయడానికి సహాయపడుతుందని శ్రీరామ్ అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది
ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది
అమ్మో.. ఈ వంటలు వండితే గ్యాస్ సిలిండర్ సగం ఖాళీ..
అమ్మో.. ఈ వంటలు వండితే గ్యాస్ సిలిండర్ సగం ఖాళీ..