AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెజ్ ఆర్డర్ చేస్తే ఎగ్ రోల్ డెలివరీ చేసిన రెస్టారెంట్‌ సిబ్బంది..! కస్టమర్‌ రియాక్షన్‌ చూడాలి..? ఏం చేశాడంటే..

రెస్టారెంట్ నుండి ఆన్‌లైన్‌లో పనీర్ రోల్ ఆర్డర్ చేశానని.. అయితే తనకు గుడ్డుతో చేసిన రోల్ పంపారని నితీష్ బుద్ధిరాజా అనే వ్యక్తి ఆరోపించారు. ఈ నవరాత్రులలో ఎగ్ రోల్ తినడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పాడు. రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు.

వెజ్ ఆర్డర్ చేస్తే ఎగ్ రోల్ డెలివరీ చేసిన రెస్టారెంట్‌ సిబ్బంది..! కస్టమర్‌ రియాక్షన్‌ చూడాలి..? ఏం చేశాడంటే..
Non Veg Rolls
Jyothi Gadda
|

Updated on: Oct 05, 2024 | 8:35 AM

Share

ఆన్‌లైన్‌ వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తికి ఎగ్ రోల్ డెలివరీ చేసి షాకిచ్చింది ఓ రెస్టారెంట్. పనీర్ రోల్‌కు బదులు ఎగ్ రోల్/నాన్ వెజ్ రోల్ పంపినందుకు బాధితుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన యూపిలోని మీరట్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ఫాదర్ ఆఫ్ రోల్స్ రెస్టారెంట్’ నుండి ఆన్‌లైన్‌లో పనీర్ రోల్ ఆర్డర్ చేశానని.. అయితే తనకు గుడ్డుతో చేసిన రోల్ పంపారని నితీష్ బుద్ధిరాజా అనే వ్యక్తి ఆరోపించారు.

ఢిల్లీ రోడ్ విశ్వా ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న నిషు అలియాస్ నితీష్ బుద్ధి రాజా బుధవారం నాడు రఘుకుల్ బీహార్, టిపి నగర్‌లోని తన అత్తమామల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు సదర్ బజార్‌లోని బాప్ ఆఫ్ రోల్ రెస్టారెంట్ నుండి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా పనీర్ రోల్‌ను ఆర్డర్ చేశాడు. పనీర్ రోల్‌కు బదులు తనకు ఎగ్ రోల్/నాన్ వెజ్ రోల్ పంపారని నిషు ఆరోపించారు. తాను శాఖాహారిని అని, అందుకే తన ఆహారంలో గుడ్డు రోల్ ఇవ్వడం వల్ల తన మనోభావాలు దెబ్బతిన్నాయని నిషు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

పైగా నవరాత్రులలో ఎగ్ రోల్ తినడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పాడు. రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రెస్టారెంట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..