AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ కోచ్‌లో ప్రయాణం.. బ్యాగులో రైల్వే దుప్పట్లు! పట్టుబడ్డ ప్రయాణికుడి వీడియో చూశారంటే..

భారతీయ రైల్వేలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తూ రైల్వే ఆస్తులను దొంగిలిస్తూ పట్టుబడిన ఈ ఘటన సివిక్ సెన్స్ పై పెద్ద చర్చకు దారితీసింది. రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ఇచ్చే దుప్పట్లు (Bedsheets), పిల్లో కవర్లను తన వ్యక్తిగత బ్యాగులో దాచుకుంటూ రైల్వే సిబ్బందికి దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ప్రయాణికుడు తన బ్యాగులో సర్దుకున్న రైల్వే సామాగ్రిని సిబ్బంది బయటకు తీయడం ఈ వీడియోలో చూడవచ్చు.

ఏసీ కోచ్‌లో ప్రయాణం.. బ్యాగులో రైల్వే దుప్పట్లు! పట్టుబడ్డ ప్రయాణికుడి వీడియో చూశారంటే..
Indian Railways Theft
Jyothi Gadda
|

Updated on: Mar 22, 2026 | 9:51 PM

Share

భారతీయ రైల్వే మన దేశానికి ఒక గొప్ప ఆస్తి. కానీ కొందరు ప్రయాణికులు చూపిస్తున్న ప్రవర్తన రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. తాజాగా ఒక ప్రయాణికుడు ఏసీ కోచ్‌లో ఉచితంగా ఇచ్చే దుప్పట్లను తన ఇంటికి పట్టుకెళ్లడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన వీడియో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. భారతీయ రైల్వేలోని సెకండ్ ఏసీ (2AC) కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ఇచ్చే దుప్పట్లు (Bedsheets) మరియు పిల్లో కవర్లను తన వ్యక్తిగత బ్యాగులో దాచుకుంటూ రైల్వే సిబ్బందికి దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ప్రయాణికుడు తన బ్యాగులో సర్దుకున్న రైల్వే సామాగ్రిని సిబ్బంది బయటకు తీయడం ఈ వీడియోలో చూడవచ్చు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక రైల్వే అటెండెంట్ ఒక ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేయడం కనిపిస్తుంది. ఆ బ్యాగు లోపల రైల్వేకు చెందిన తెల్లటి దుప్పట్లు, దిండు గలీబులు వరుసగా సర్ది ఉన్నాయి. సదరు ప్రయాణికుడు సెకండ్ ఏసీ (2AC) లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. రైలు గమ్యస్థానానికి చేరుకోకముందే ఆ సామాగ్రిని తన బ్యాగులో దాచుకున్నాడు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ దొంగతనాన్ని బట్టబయలు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టికెట్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయగలరు కానీ, వందల రూపాయల విలువైన దుప్పటిని దొంగిలిస్తున్నారు అని నెటిజన్లు మండిపడుతున్నారు. చదువుకున్న వారు, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఇలాంటి పనులకు పాల్పడటం సిగ్గుచేటని కామెంట్స్ చేస్తున్నారు.

రైల్వే గణాంకాల ప్రకారం, ప్రతి ఏటా లక్షలాది దుప్పట్లు, తువ్వాళ్లు, దిండ్లు, స్పూన్లు రైళ్లలో నుండి మాయమవుతున్నాయి. దీనివల్ల రైల్వే శాఖకు ఏటా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. రైల్వే ఆస్తులు ప్రజా ఆస్తులని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

మనం మన ఇంటి వస్తువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ప్రభుత్వ ఆస్తులను కూడా అలాగే గౌరవించాలి. ఇలాంటి దొంగతనాలకు పాల్పడితే కేవలం జరిమానాలే కాకుండా, చట్టపరమైన కఠిన చర్యలు కూడా ఉంటాయని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us