Viral Video: వినూత్నంగా ఆలోచించిన జంట.. జేసీబీ‎పై పెళ్లి మండపానికి.. వైరలైన వీడియో..

ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి మధర అనుభూతిగా నిలిచిపోవాలని భావిస్తారు. అందుకే వివాహాన్ని గ్రాండ్‎గా చేసుకుంటారు. కొందురు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు.

Viral Video: వినూత్నంగా ఆలోచించిన జంట.. జేసీబీ‎పై పెళ్లి మండపానికి.. వైరలైన వీడియో..
Marriage
Follow us

|

Updated on: Oct 05, 2021 | 6:45 PM

ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి మధర అనుభూతిగా నిలిచిపోవాలని భావిస్తారు. అందుకే వివాహాన్ని గ్రాండ్‎గా చేసుకుంటారు. కొందురు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు. జంటలు తమ వివాహ వేదిక వద్దకు గ్రాండ్ ఎంట్రీ అవడానికి ప్రత్యేకమైన మార్గాలను ఎంచుకుంటారు. ఇలా ఓ జంట వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.

అందరిలా లగ్సరీ కార్లలో కాకుండా పాకిస్థాన్‌కు చెందిన ఒక జంట జేసీబీ‎పై పెళ్లి మండపానికి చేరుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. వివాహ వస్త్రధారణలో ఉన్నపెళ్లి కొడుకు, పెళ్లి కూతురు జేసీబీ‎ బకెట్ మీద నిలబడి వివాహ వేదికకు వచ్చారు. పూలతో అలంకరించబడిన జేసీబీ‎ యొక్క బకెట్‌లో రెండు సోప సీట్లు ఉంచారు. వధువరులు అందులోకి ఎక్కించారు. బంధువులు హర్షధ్వానాల మధ్య ఆపరేటర్ జేసీబీ‎ని స్టార్ట్ చేసి ముందుకు నడిపారు. ఈ వివాహం పాకిస్తాన్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలోని హుంజా వ్యాలీలో జరింది.

దీన్ని వీడియో తీసి ట్విట్టర్‎లో పోస్ట్ చేయటంతో వైరల్ అయింది. అయితే వీడియోపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. మంచి ఆలోచన అంటూ ఒకరు.. ఇలాంటి చాలా చూశామని మరొకరు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఇలాంటివి ప్రమాదకరమని చెబుతున్నారు. అప్పట్లో ఓ జంట వినూత్నంగా ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకుందని గుర్తు చేస్తున్నారు.

Read Also.. Viral Video: రోడ్డుపై లారీని ఆపిన గజరాజు.. లారీ పైకెక్కిన క్లీనర్ .. తర్వాత..