AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

571కి చేరిన ఏలూరు వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య, బలహీనపడుతున్న వ్యాధి, పది నిమిషాలకు ఒక కేసు నుంచి గంటకో కేసు

ఏలూరు నగరంతో పాటు సమీపంలోని గ్రామాలను కలవరపరుస్తున్న వింత వ్యాధి వ్యాధి బలహీన పడుతోంది. క్రమంగా రోగుల సంఖ్య తగ్గుతోంది. వింత వ్యాదిగ్రస్తుల సంఖ్య ప్రస్తుతం 571కి చేరింది. మొత్తం 468 మంది డిఛార్జ్ కాగా ఇంకా 72 మందికి చికిత్స అందుతోంది.

571కి చేరిన ఏలూరు వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య, బలహీనపడుతున్న వ్యాధి,  పది నిమిషాలకు ఒక కేసు నుంచి గంటకో కేసు
Anil kumar poka
|

Updated on: Dec 09, 2020 | 7:08 AM

Share

Eluru disease: ఏలూరు నగరంతో పాటు సమీపంలోని గ్రామాలను కలవరపరుస్తున్న వింత వ్యాధి వ్యాధి బలహీన పడుతోంది. క్రమంగా రోగుల సంఖ్య తగ్గుతోంది. వింత వ్యాదిగ్రస్తుల సంఖ్య ప్రస్తుతం 571కి చేరింది. మొత్తం 468 మంది డిఛార్జ్ కాగా ఇంకా 72 మందికి చికిత్స అందుతోంది. రోగుల్లో 1 నుంచి 12 సంవత్సరాల మధ్య వారు 75 మంది ఉన్నారు. ఇందులో బాలురు 45, బాలికలు 30 మంది ఉన్నారు. 12 నుంచి 35 ఏళ్ల మధ్యవారు 311 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 153మంది, మహిళలు 158 మంది ఉన్నారు. 35 ఏళ్లకు పైబడిన వారు మొత్తం 185 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 101, మహిళలు 84 మంది ఉన్నారు.

విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు 30 మందిని తరలించారు. ఎయిమ్స్ బృందం రోగులను నుంచి శాంపిల్స్ సేకరించింది. కూరగాయల్లో రసాయనాలు, పాల కల్తీయే కారణమని ఎయిమ్స్ నిపుణుల అంచనాకు వచ్చారు. రోగుల వెన్నుపూస నుంచి తీసిన నమూనాలపై చేసిన కల్చర్ పరీక్షల ఫలితాల్లోనే నెగిటివ్ వచ్చింది. బాధితుల శరీరాల నుంచి తీసిన శాంపిల్స్ లో నికెల్ , సీసం అవశేషాలు అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. పాలు , నీరు తదుపరి పరీక్షల కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు శాంపిల్స్ ను అధికారులు పంపించారు. పది నిమిషాలకు ఒక కేసు వచ్చే దగ్గరి నుంచి గంటకో కేసు వస్తోంది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. ఏలూరులో ని అన్ని సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రంతా కేవలం 6 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఈ వింత వ్యాధిని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా రంగంలో దిగారు. జాతీయ స్థాయి నిపుణులు కూడా ఏలూరు వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వైద్యరంగానికి చెందిన పరిశోధకులు ఏలూరులో అంతుచిక్కని సమస్యకి అసలు కారణాలు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్‌కి పంపించిన శాంపిళ్ల ద్వారా ప్రాథమిక నివేదిక బయటికి వచ్చింది. పేషెంట్ల బ్లడ్ శాంపిల్స్‌లో ఎక్కువగా సీసం (లెడ్), నికెల్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే.

Follow Us
ఈ బస్సుల మీద ఏముందో జాగ్రత్తగా గమనించండి.. ఐడియా చూస్తే
ఈ బస్సుల మీద ఏముందో జాగ్రత్తగా గమనించండి.. ఐడియా చూస్తే
లెగ్గింగ్స్ vs షార్ట్స్? పరిగెత్తేటప్పుడు ఏది మంచిదో తెలుసుకోండి
లెగ్గింగ్స్ vs షార్ట్స్? పరిగెత్తేటప్పుడు ఏది మంచిదో తెలుసుకోండి
యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న ఫోక్ సాంగ్..
తండ్రి పాడె మోసిన టీమిండియా స్టార్..కన్నీరుమున్నీరైన రింకూ సింగ్
తండ్రి పాడె మోసిన టీమిండియా స్టార్..కన్నీరుమున్నీరైన రింకూ సింగ్
మహిళలకు బంపర్ ఆఫర్.. పది పాసైతే చాలు.. నెలకు రూ.7 వేల ఆదాయం..
మహిళలకు బంపర్ ఆఫర్.. పది పాసైతే చాలు.. నెలకు రూ.7 వేల ఆదాయం..
కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి చంద్రబాబు గుడ్ న్యూస్
కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి చంద్రబాబు గుడ్ న్యూస్
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు