AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఉప్పునీటితో వెలిగే లాంతర్.. మొబైల్‌ ఫోన్లు కూడా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు

ట్రెండ్ మారింది. టెక్నాలజీ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఉప్పు నీటితో వెలిగే ఓ లాంతర్ ఆవిష్కరణ జరిగింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.....

Viral: ఉప్పునీటితో వెలిగే లాంతర్.. మొబైల్‌ ఫోన్లు కూడా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు
Light Pulse Echo Lantern
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2022 | 4:19 PM

Share

మీకొక అద్భుత దీపం గురించి చెప్ప బోతున్నాం. ఇది పాతకాలం నాటి లాంతరులా ఉంటుంది. దీనిని వెలిగించడానికి కిరోసిన్‌ కానీ, నూనెకానీ, అవసరం లేదు. అలాగని ఇది కరెంట్‌ దీపమా అంటే అదీ కాదు.. దీనికి కరెంట్‌ అవసరం లేదు.. బ్యాటరీ కూడా అవసరం లేదు. ఉప్పునీరు ఉంటే చాలు. నమ్మడం లేదు కదా.. నిజం… దీనిని ‘లైట్‌పల్స్‌ ఎకో లాంతర్‌’ పేరిట ‘గ్యాలప్‌ ఇన్నోటెక్‌’ అనే చైనా(China) కంపెనీ రూపొందించింది. కాగా ఉప్పునీటితో ఇదెలా వెలుగుతుందనే సందేహం మీకు రావొచ్చు. మామూలు లాంతరులో మనం కిరోసిన్ నింపుతాం. ఇందులో ఉప్పునీరు పోస్తే సరిపోతుంది. దీని అడుగుభాగంలో అల్యూమినియం మెటలర్ ఉంటుంది. దాంతో జరిపే రసాయనిక చర్య వల్ల పుట్టే విద్యుత్తే దీనికి ఇంధనం. ఈ లాంతరు వెలుతురును కోరుకున్న విధంగా అడ్జస్ట్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఇది కేవలం వెలుతురు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు, ఈ లాంతరుకు ఉన్న యూఎస్‌బీ పోర్టు ద్వారా దీపం వెలుగుతూ ఉండగా.. మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చార్జింగ్‌ చేసుకోవచ్చు కూడా.

Also Read: Thati Munjalu: ఏంటి ఎండాకాలంలో తాటి ముంజలు తినడం లేదా..? మీరు చాలా మిస్సవుతున్నారు