AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మతి స్థిమితం లేని మహిళలకు చేతిలెత్తి మొక్కుతున్న జనం.. టోపీ అమ్మ

తమిళనాడులోని తిరువణ్ణాలమై పర్వతాల్లో కొలువై ఉన్న అరుణాచలం గురించి తెలిసిందే. గిరి ప్రదిక్షణలకు ఈ గుడి పెట్టింది పేరు. ఇక్కడే ఉంటుందీ టోపీ అమ్మ. అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ, ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుందీమే. ఈమెనే భక్తులు అవధూతగా భావిస్తున్నారు, ఆమెను పూజిస్తారు. ఆమె తాగి పడేసిన టీ కప్పును...

మతి స్థిమితం లేని మహిళలకు చేతిలెత్తి మొక్కుతున్న జనం.. టోపీ అమ్మ
Topi Amma
Narender Vaitla
|

Updated on: Mar 29, 2024 | 10:57 AM

Share

ఆమె ఒక మతి స్థిమితం లేని మహిళ. తలపై టోపీతో మాసిన దుస్తులతో దర్శనమిస్తుంది. అసలు ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు తన పనితాను చేసుకుంటూ పోతుంది. అయితే ఆమెను దైవా సమానులుగా భావిస్తున్నారు. ప్రజలు ఆమె నీడ పడడమే మహా భాగ్యంగా భావిస్తున్నారు. ఆమెకు టోపీ అమ్మగా పేరు కూడా పెట్టుకున్నారు. ఇంతకీ ఎవరీ టోపీ అమ్మ.? అసలు కథ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

తమిళనాడులోని తిరువణ్ణాలమై పర్వతాల్లో కొలువై ఉన్న అరుణాచలం గురించి తెలిసిందే. గిరి ప్రదిక్షణలకు ఈ గుడి పెట్టింది పేరు. ఇక్కడే ఉంటుందీ టోపీ అమ్మ. అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ, ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుందీమే. ఈమెనే భక్తులు అవధూతగా భావిస్తున్నారు, ఆమెను పూజిస్తారు. ఆమె తాగి పడేసిన టీ కప్పును మహా ప్రసాదంగా భావిస్తుంటారు. ఎవరితో మాట్లాడదు. కానీ అంతా ఆమె వెంట పడుతున్నారు. ఎంత అమూల్యమైన వస్తువును ఇచ్చినా విసిరిపారేస్తుంది.

సాయంత్రం అయితే చాలా యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో కనిపిస్తుంది. అక్కడ ప్రజలు ఆమె దర్శనం కోసం బారులు తీరుతుంటారు. అయితే మతిస్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారనే దాని వెనకాల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం.. కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ ఉండేది. కారు టైర్‌ కింద పడిపోయిన ఒక కుక్క పేగుల అన్ని బయటకు రాగా, ఆమె ఆ పేగులను చేతితో కడుపులోకి నెట్టి ఆ కుక్కకు ప్రాణం పోసిందని.. ఆ తర్వాత నుంచి ప్రజలు ఆమెను దేవతగా పూజిస్తూ వచ్చారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించి మళ్లీ టోపీ అమ్మగా జన్మించిందని కొందరి విశ్వాసం.

అలాగే కొన్నేళ్ల క్రితం అరుణాచలం వచ్చిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా టోపీ అమ్మ అనుగ్రహం పొందగానే ఆ సమస్య తగ్గిపోయిందని దీంతో టోపీ అమ్మను దైవంగా భావించడం మొదలైంది. ఇక టోపీ అమ్మ ప్రతీ రోజు కచ్చితంగా గిరి ప్రదిక్షణలు చేస్తుంది. ఆమె ఇప్పటి వరకు ఏకంగా 11 వేల సార్లు గిరి ప్రదిక్షణలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమెను దేవతగా భావిస్తూ పూజిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..