బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా

భోపాల్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి సిద్ధి మిశ్రా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపునకు చేరుకుని రికార్డు సృష్టించింది. సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న బేస్‌క్యాంపునకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా సిద్ది మిశ్రా రికార్డులకెక్కింది. ప్రైవేట్ ట్రెక్కింగ్ కంపెనీ ఈ విషయాన్ని నిర్ధారించింది. 2019లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తల్లి భావన దేహరియా, తండ్రి మహిమ్ మిశ్రాతో కలిసి సిద్ధి మార్చి 22న ఈ ఘనత సాధించింది.

బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా

|

Updated on: Mar 29, 2024 | 1:26 PM

భోపాల్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి సిద్ధి మిశ్రా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపునకు చేరుకుని రికార్డు సృష్టించింది. సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న బేస్‌క్యాంపునకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా సిద్ది మిశ్రా రికార్డులకెక్కింది. ప్రైవేట్ ట్రెక్కింగ్ కంపెనీ ఈ విషయాన్ని నిర్ధారించింది. 2019లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తల్లి భావన దేహరియా, తండ్రి మహిమ్ మిశ్రాతో కలిసి సిద్ధి మార్చి 22న ఈ ఘనత సాధించింది. మార్చి 12న ఎవరెస్ట్‌లోని ఈశాన్యం వైపున ఉన్న లుక్లా నుంచి ట్రెక్కింగ్ ప్రారంభం కాగా 10 రోజుల్లోనే చిన్నారి తన లక్ష్యాన్ని చేరుకున్నట్టు ఎక్స్‌పెడిషన్ హిమాలయ పేర్కొంది. చింద్వారాకు చెందిన భావన.. కుమార్తె సాధించిన విజయానికి పొంగిపోయారు. ట్రెక్కింగ్ సమయంలో తాము ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నామని వివరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??

మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్‌ అలర్ట్‌ !!

లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ న్యూస్‌

Follow us