టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??

పీకలదాకా మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులు తగిన బుద్ది చెప్పారు. తప్పతాగి తప్పటడుగులు వేస్తూ స్కూల్ లోకి వచ్చి పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా విద్యార్ధులను దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. దీంతో తాగుబోతు అరాచాకాలు సహించలేక బాలలంతా కలిసి అతనిపై ఎదురు దాడి చేశారు. ఈ ఘటన ఛత్తీస్ గడ్ బస్తర్ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??

|

Updated on: Mar 29, 2024 | 1:25 PM

పీకలదాకా మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులు తగిన బుద్ది చెప్పారు. తప్పతాగి తప్పటడుగులు వేస్తూ స్కూల్ లోకి వచ్చి పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా విద్యార్ధులను దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. దీంతో తాగుబోతు అరాచాకాలు సహించలేక బాలలంతా కలిసి అతనిపై ఎదురు దాడి చేశారు. ఈ ఘటన ఛత్తీస్ గడ్ బస్తర్ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాగిన మైకంలో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఉపాధ్యాయడిని పాఠశాల ప్రాంగణం నుంచి తరిమికొట్టారు. చదువు చెప్పకుండా తిడతావా.. అంటూ చెప్పులు విసురుతూ గేటు బయట వరకు తరిమేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. సరైన బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు చిన్నారులను మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్‌ అలర్ట్‌ !!

లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ న్యూస్‌

Follow us