AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టన్నుల కొద్దీ బంగారం, కోట్లలో నిధి.. కట్ చేస్తే.. 400 ఏళ్ల పాటు వెంటాడిన శాపం

భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ఆ రాజు రాజభవనంలో 750 కిలోల బంగారం, వెండి శిల్పాలు, వజ్రాలు, ముత్యాలతో నిండిన అలంకరణలతో కూడిన సింహాసనం ఇప్పటికీ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అలాంటి రాజవైభోగం కలిగిన ఆ రాజభవనానికి సంబంధించిన ఒక రహస్యం కూడా ఉంది. ఈ కుటుంబానికి ఒక రాణి శాపం ఉందని చెబుతారు. అది 400 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టి పీడించిందని కూడా అంటారు.

టన్నుల కొద్దీ బంగారం, కోట్లలో నిధి.. కట్ చేస్తే.. 400 ఏళ్ల పాటు వెంటాడిన శాపం
Mysore Palace
Jyothi Gadda
|

Updated on: Feb 19, 2025 | 6:10 PM

Share

రాజులు, మహారాజుల గురించి చర్చించుకున్న ప్రతి సందర్భంలో భారతదేశంలోని ఈ ప్యాలెస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. భారతదేశంలో రాచరికం ముగిసినప్పటికీ, రాజకుటుంబాల రాజ హోదా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. అది గ్వాలియర్ జై విలాస్ ప్యాలెస్ అయినా లేదా మైసూర్ అంబా విలాస్ ప్యాలెస్ అయినా. భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ఆ రాజు రాజభవనంలో 750 కిలోల బంగారం, వెండి శిల్పాలు, వజ్రాలు, ముత్యాలతో నిండిన అలంకరణలతో కూడిన సింహాసనం ఇప్పటికీ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అలాంటి రాజవైభోగం కలిగిన ఆ రాజభవనానికి సంబంధించిన ఒక రహస్యం కూడా ఉంది. ఇది 400 సంవత్సరాలుగా ఈ రాజకుటుంబాన్ని అనుసరిస్తోంది. మైసూర్‌ ప్యాలెస్‌..వైభవం, దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం..

మైసూర్ ప్యాలెస్‌ను అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యాలెస్ దేశంలో తాజ్ మహల్ తర్వాత అత్యధికంగా సందర్శించబడే రెండవ ప్రదేశం. మీరు ఈ రాజభవనాన్ని చూడటానికి వెళ్ళినప్పుడల్లా, ఖచ్చితంగా దాని సింహాసనాన్ని చూడండి. ఈ సింహాసనం 750 కిలోల బంగారంతో తయారు చేయబడింది. అది చాలా పొడవుగా, వెడల్పుగా ఉండటం వల్ల దానిపై కూర్చోవడానికి ఒక నిచ్చెనను ఏర్పాటు చేశారు. దీనిని 1897, 1912 సంవత్సరాల మధ్య మహారాజా కృష్ణరాజేంద్ర వడియార్ IV నిర్మించారు. ఈ రాజభవనాన్ని నిర్మించడానికి 15 సంవత్సరాలు పట్టింది.

మహారాజా కృష్ణరాజేంద్ర వడియార్ IV భారతదేశంలో అత్యంత ధనవంతుడైన రాజు. రాజభవన నిర్మాణంలో డబ్బు నీళ్లలా ఖర్చు చేశారని అంటారు.. ఆ రాజభవన గోడలు బంగారంతో పూత పూయబడ్డాయి. చెక్కడాల నుండి గాజు గోపురం పైకప్పుల వరకు అణువణువు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దర్బార్ హాల్ అలంకరణలో బంగారు ఆకులను ఉపయోగించారు. పైకప్పుపై క్లిష్టమైన బంగారు శిల్పాలు ఉన్నాయి. అయితే, మైసూర్ ప్యాలెస్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు, ప్రస్తుత మైసూర్ ప్యాలెస్ నిర్మాణానికి ముందు, ఈ ప్యాలెస్ గంధపు చెక్కతో తయారు చేయబడిందని, కానీ, 1897 సంవత్సరంలో యువరాణి జయలక్ష్మి వివాహం సమయంలో గంధపు చెక్క ప్యాలెస్ అగ్నిప్రమాదం కారణంగా ధ్వంసమైందని చెబుతారు. ఆ తరువాతే ఈ అందమైన ప్యాలెస్ నిర్మించారని చరిత్ర చెబుతోంది.

ఇవి కూడా చదవండి

దసరా పండుగ రోజు మైసూర్ ప్యాలెస్ అందం అనేక రెట్లు పెరుగుతుంది. లక్షలాది దీపాల కాంతి వల్ల ఆ రాజభవనం బంగారంలా ప్రకాశిస్తుంది. 21 తుపాకీల వందనం తర్వాత బంగారం, వెండితో అలంకరించబడిన ఏనుగుల కాన్వాయ్ మైసూర్ ప్యాలెస్ నుండి బయలుదేరుతుంది. దీన్ని చూడటానికి ప్రజలు దూర ప్రాంతాల నుండి వస్తారు. ఈ రాజభవనం లోపల 12 ఆలయాలు ఉన్నాయి. దసరా సందర్భంగా దేవత ప్రదక్షిణ కోసం బయటకు వచ్చే ప్రదేశం. బంగారం, వెండితో అలంకరించబడిన ఏనుగుల కాన్వాయ్‌కు నాయకత్వం వహిస్తున్న ఏనుగు వెనుక భాగంలో 750 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడిన అంబర్ (సింహాసనం) ఉంటుంది. దానిలో మాతా చాముండేశ్వరి విగ్రహం ఉంచి ఊరేగిస్తారు.

హౌసింగ్.కామ్ ప్రకారం, 31,36,320 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మైసూర్ ప్యాలెస్ విలువ దాదాపు రూ.3,136.32 కోట్లు. ఆ రాజభవనంలోని ఒక భాగాన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇక్కడ మీరు టికెట్ కొనుక్కొని రాజులు, మహారాజుల వైభవాన్ని దగ్గరగా చూడవచ్చు. రాజభవనం లోపల రాజకుటుంబం కోసం నిర్మించిన ప్రైవేట్ గదులు చాలా గొప్పగా, ఆకర్షణీయంగా ఉన్నాయి.. ఈ రాజభవనాన్ని ప్రత్యేకంగా రాజులు, రాణులు నివసించడానికి రూపొందించారు. ప్రతి ఒక్కటి రాజ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. మైసూర్ ప్యాలెస్ లోపల అనేక మందిరాలు, మండపాలు ఉన్నాయి. అక్కడ రాజ కార్యక్రమాలు, దర్బార్లు, వివాహ వేడుకలు జరిగాయి.

మైసూర్‌కు చెందిన వడియార్ రాజవంశం భారతదేశంలో అత్యంత ధనిక రాజకుటుంబం. కానీ ఈ కుటుంబానికి ఒక రాణి శాపం ఉందని చెబుతారు. అది 400 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టి పీడించిందని కూడా అంటారు. గత 400 సంవత్సరాలుగా తమను ఒక శాపం వెంటాడుతోందని, దాని కారణంగా తమ వంశంలో సంతానం పుట్టలేదని వడియార్ రాజకుటుంబం స్వయంగా నమ్ముతుంది.

1612లో దక్షిణాదిలో అత్యంత శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత, వడియార్ రాజు విజయనగర సంపద మొత్తాన్ని దోచుకున్నాడని చెబుతారు. అప్పటి విజయనగర రాణి అలమేలమ్మ దగ్గర చాలా బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు ఉండేవట. వడియార్ రాణి వద్దకు ఒక దూతను పంపి, అన్ని ఆభరణాలను వడియార్ సామ్రాజ్యానికి అప్పగించమని కోరాడు. రాణి అలమేలమ్మ ఆభరణాలు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, వడియార్ రాజ సైన్యాన్ని పంపించి ఆమె నుండి బలవంతంగా నిధిని లాక్కున్నాడు. దీంతో బాధపడిన రాణి అలమేలమ్మ, వడియార్ రాజకుటుంబాన్ని శపించిందట.. మీరు నా ఇంటిని నాశనం చేసినట్లే, మీ వంశం కూడా పిల్లలు లేకుండా పోతుందని శాపం పెట్టిందని చెబుతారు.. శాపం ఇచ్చిన తర్వాత, రాణి అలమేలమ్మ కావేరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందట.

శాపం నుండి తప్పించుకోవడానికి, మైసూర్ ప్యాలెస్ లోపల అలమేలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేవతగా పూజించారు. కానీ శాపం నుండి విముక్తి లభించలేదు. వడియార్ రాజకుటుంబానికి చెందిన ఏకైక కుమారుడు చనిపోయాడు. ఆ తరువాత రాజ కుటుంబంలో కుమారుడు పుట్టలేదు. మైసూర్ 27వ రాజు యదువీర్, దుంగార్పూర్ యువరాణి త్రిషికా సింగ్‌ను 27 జూన్ 2016న వివాహం చేసుకున్నాడు. యువరాణి త్రిషికా సింగ్ మైసూర్ రాణి అయినప్పుడు, ఆమె 400 సంవత్సరాల నాటి శాపాన్ని బద్దలు కొట్టింది. రాజకుటుంబంలో ఒక కుమారుడు జన్మించాడు. యదువీర్ వడియార్ అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పొందారని, ఆయన ప్రస్తుత వడియార్ రాజు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us