సోషల్ మీడియా జనాలకు ఎంతగా ఉపయోగపడుతుందో అంతకు మించి అనర్ధాలకు దారితీస్తోంది. సోషల్ మీడియా ద్వారా అవుతున్న పరిచయాలు దారుణాలకు తెరతీస్తున్నాయి. పెళ్లి కాని వారి సంగతి పక్కన పెడితే పెళ్లైన వారు కూడా తప్పుడు బంధాల్లో చిక్కుకుపోతున్నారు. కొత్త పరిచయాంతో ప్రాణాలు కోల్పోతున్నారు. సోషల్ మీడియా కారణంగా ఏర్పడ్డ అక్రమ సంబంధాల వల్ల దేశవ్యాప్తంగా నిత్యం ఎవరో ఒకరు బలవుతునే ఉన్నారు. ఇదే కోవలో తాజాగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ మహిళ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.
భార్యను కాదని ప్రియురాలి కోసం సాహసం చేయడం విషాదంగా ముగిసింది. ప్రియురాలే ఆస్తి కోసం అతడి ప్రాణాలు తీసేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు దొరై స్వామి అలియాస్ సూర్యుడి మైసూరు తాలూకాలోని అనుగణహళ్ళి గ్రామం ఇతడికి ఆరు సంవత్సరాల క్రితం హింకల్కు చెందిన దీపికతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్యకు కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్వేత అనే మహిళ పరిచయమైంది. కొన్ని నెలలకు ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో సూర్య, దీపికల మధ్య గొడవలు జరిగేవి. అతడు భార్యను బాగా కొట్టేవాడు. బరితెగించి శ్వేతను నేరుగా ఇంటికే తీసుకొచ్చేవాడు. అంతటితో ఆగకుండా శ్వేతతో కలిసి దిగిన ఫోటోలను తన స్టేటస్లలో పెట్టేవాడు. సూర్య ప్రవర్తన రోజురోజుకు దారుణంగా తయారవడంతో దీపిక, సూర్య తల్లి పుష్ప వేరే ఇల్లు తీసుకొని అందులోకి షిఫ్ట్ అయ్యారు. సూర్య మాత్రం శ్వేతతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. వీరి వ్యవహారం ఎక్కువ కాలం సాఫీగా సాగలేదు. శ్వేత డబ్బు కోసం సూర్యను ఇబ్బంది పెడుతూ ఉండేది. ఆస్తి అమ్మి తనకు డబ్బులు ఇవ్వమనేది. శ్వేత మాటలు విని సూర్య తన భార్య, తల్లిని ఇబ్బంది పెట్టేవాడు. ఆస్తి అమ్మాలంటూ బలవంతం చేసేవాడు. కానీ వాళ్లు మాత్రం ఆస్తి అమ్మడానికి ఒప్పుకోలేదు. ఆస్తి అమ్మడానికి ఒప్పుకోలేదన్న కోపంతో సొంత తల్లి, చెల్లి, భార్యను చంపుతానంటూ బెదిరించాడు.
మరోవైపు సూర్యకు, శ్వేత వేధింపులు ఎక్కువయ్యాయి. సూర్య ఈ వేధింపుల గురించి భార్యకు వాయిస్ మెసేజ్లు పంపేవాడు. నిన్న రాత్రి సూర్య, శ్వేత అనుగణహళ్ళి ఫామ్ హౌస్ లో కలిసి ఉన్నారు. ఉదయాన్నికి సూర్య అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో శ్వేతకు సంబంధించిన వస్తువులు దొరికినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్వేత కోసం గాలిస్తున్నారు. సూర్యను శ్వేతే హత్య చేసి ఉంటుందని సూర్య తల్లి పుష్ప ఆరోపించింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.