AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక వరుడు, ఇద్దరు వధువులు.. గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరికీ తాళికట్టిన ప్రియుడు

ఇద్దరు గ‌ర్ల్‌ఫ్రెండ్స్‌కు ఒకే వేదిక‌పై తాళి క‌ట్టిన వ్యక్తి ఉదంతం జార్ఖండ్‌లోని లోహర్‌ద‌గ గ్రామంలో వెలుగుచూసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.

ఒక వరుడు, ఇద్దరు వధువులు.. గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరికీ తాళికట్టిన ప్రియుడు
Groom Marries Two Women
Jyothi Gadda
|

Updated on: Jun 20, 2022 | 8:28 PM

Share

ఇద్దరు గ‌ర్ల్‌ఫ్రెండ్స్‌కు ఒకే వేదిక‌పై తాళి క‌ట్టిన వ్యక్తి ఉదంతం జార్ఖండ్‌లోని లోహర్‌ద‌గ గ్రామంలో వెలుగుచూసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. చ‌ట్ట ప్రకారం ఇద్దరు మ‌హిళ‌ల‌ను పెండ్లి చేసుకోవ‌డం త‌ప్పే అయినా, తాను వారిద్దరినీ విడిచి ఉండ‌లేన‌ని చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరూ నాకిష్టమే.. అందుకే నా గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరికీ ఒకే వేదిక‌పై తాళి క‌ట్టేశాను అని అతడు నిర్భయంగా, నిర్మోహమాటంగా చెబుతున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

లోహర్‌ద‌గ గ్రామంలోని కుసుం ల‌క్రా, స్వాతి కుమారి అనే ఇద్దరు యువతులను సందీప్ ఓరాన్‌ అనే వ్యక్తి ప్రేమించారు. ఇక.. అత‌డిని వ‌దులుకోలేక గ్రామంలోని ఒకే మండ‌పంలో సందీప్‌ను ఇద్దరూ పెళ్లాడారు. మూడేండ్లుగా సందీప్, కుసుం స‌న్నిహితంగా ఉంటున్నారు. వారిద్దరూ ఓ బిడ్డకు కూడా జ‌న్మనిచ్చారు. ఈ క్రమంలో సందీప్ ఇటుక బ‌ట్టీలో ప‌నిచేసేందుకు బెంగాల్‌కు వెళ్లగా అదే బ‌ట్టీలో ప‌నిచేసే స్వాతి కుమారికి ద‌గ్గర‌య్యాడు. వారు త‌మ గ్రామాల‌కు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కూడా త‌ర‌చూ కలుసుకునే వారు. ఇరు కుటుంబాల్లో వారి సంబంధంపై గొడ‌వ‌లు చెల‌రేగ‌గా విష‌యం పంచాయితీకి చేరింది. సందీప్ ఇద్దరు మ‌హిళ‌ల‌ను పెండ్లి చేసుకోవాల‌ని గ్రామ పెద్దలు తీర్మానించ‌డంతో మ‌హిళ‌లు ఇద్దరూ ఇష్టప‌డటంతో ముగ్గురు వైవాహిక బంధంతో ఒక్కట‌య్యారు.

ఇవి కూడా చదవండి
Groom Marries Two

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి