AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లాడు.. ఎలా దొరికాడంటే..!

ద్వారకలో నిత్యం పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తీసుకుంటారు. అందువల్ల, పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి (పిఎస్‌ఓ) వాహనాన్ని తమ సిబ్బంది నోటీసు లేకుండా తీసుకెళుతుంటారు..ఆ కారణంగానే ఎవరూ గమనించి ఉండరని చెప్పారు. వాహనాన్ని బయటకు తీయడం చూశారు. కానీ డ్రైవర్ ముఖం చూడలేదని చెప్పారు. కొంత సేపటి తర్వాత ఎస్‌యూవీ ఎక్కడా లేదని పోలీసు డ్రైవర్ గమనించాడు.

ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లాడు.. ఎలా దొరికాడంటే..!
Man Steals Police Vehicle
Jyothi Gadda
|

Updated on: Dec 30, 2023 | 6:16 PM

Share

పరువు నష్టం కేసులో ఓ వ్యక్తి పోలీసు కారును దొంగిలించి వీరంగం సృష్టించాడు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న ఎస్‌యూవీని వాహనాన్ని పోలీసుల ముందే కొట్టేశాడు. నిందితుడి పేరు మోహిత్ శర్మ అని తెలిసింది.. మోహిత్‌పై ఇప్పటికే పరువు నష్టం కేసు నడుస్తోంది. మోహిత్ పోలీసు కారును చోరీ చేసి దాదాపు 200 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఇది మాత్రమే కాదు, నిందితుడు మోహిత్ తను కొట్టేసిన పోలీసు వాహనంతో మార్గ మధ్యలో సెల్ఫీలు దిగి తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశాడు. దాదాపు 6 గంటల పాటు అలా పోలీస్‌ వాహనంతో షీకార్లు కొట్టిన మోహిత్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడు మోహిత్ శర్మగా గుర్తించారు. అతనిపై ఇప్పటికే పరువు నష్టం కేసు పెండింగ్‌లో ఉందని వివరించారు.

గురువారం ఉదయం 8:15 గంటలకు మోహిత్ పోలీస్‌ వాహనాన్ని ఎత్తుకెళ్లినట్టుగా స్టేషన్‌ సిబ్బంది తెలిపారు. అనంతరం జామ్‌నగర్‌లోని అంబర్ చౌక్డీ సమీపంలో మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్లాలని చెప్పి బైక్‌పై ద్వారకకు వచ్చాడు. ఆ తర్వాత ద్వారకా పోలీస్‌స్టేషన్‌ సమీపంలో బైక్‌ను ఆపి ఎస్‌యూవీతో పరారయ్యాడని చెప్పారు.

ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా స్పందించారు. ద్వారకలో నిత్యం పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తీసుకుంటారు. అందువల్ల, పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి (పిఎస్‌ఓ) వాహనాన్ని తమ సిబ్బంది నోటీసు లేకుండా తీసుకెళుతుంటారు..ఆ కారణంగానే ఎవరూ గమనించి ఉండరని చెప్పారు. వాహనాన్ని బయటకు తీయడం చూశారు. కానీ డ్రైవర్ ముఖం చూడలేదని చెప్పారు. కొంత సేపటి తర్వాత ఎస్‌యూవీ ఎక్కడా లేదని పోలీసు డ్రైవర్ గమనించాడు. పోర్‌బందర్ మరియు జామ్‌నగర్‌లోని అన్ని పోలీసు స్టేషన్లు, పెట్రోలింగ్ పాయింట్లు మరియు వారి సహచరులను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. సీసీటీవీలో కారు కురంగ, ఖంభాలియా టోల్ గేట్లను దాటుతున్నట్లు కనిపించింది. డీజిల్ ట్యాంక్ ఫుల్లుగా ఉండటం వల్ల మోహిత్‌ శర్మకు కారులో డీజిల్‌ నింపాల్సిన అవసరం రాలేదని చెప్పారు. కానీ, ఎట్టకేలకు మోహిత్‌ శర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

పరువు నష్టం కేసులో మోహిత్ శర్మను గాంధీధామ్ పోలీసులు విచారిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. పోలీసు విచారణ సందర్భంలోనే అతడు పోలీసు కారును దొంగిలిస్తానని విచారణ అధికారిని బెదిరించాడని చెప్పారు. కారును దొంగిలించి స్క్రాప్‌గా విక్రయించడమే అతని ఉద్దేశంగా అనుమానిస్తున్నామని చెప్పారు. నిందితుడు శర్మ గంజాయికి బానిసైనట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..