AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025 కుంభమేళాలో ఫేమస్ IIT బాబా పెళ్లి! ఇంటర్‌నెట్‌లో ఇప్పడిదే హాట్‌టాపిక్..? ఎందుకంటే..

2025 మహాకుంభమేళాలో IIT బాబాగా సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన సిద్ధాంత్ గిరి, తాజాగా బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. ఆధ్యాత్మికత, ఆధునిక విద్య కలయికతో ఆయన ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధ్యాత్మికత మార్గంలో ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ సాధారణ జీవితంలోకి రావడం, ఒక విద్యావంతురాలైన యువతిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మహాకుంభమేళా 2025లో సుమారు 45 లక్షల మంది ఫాలోవర్లతో సెన్సేషన్‌గా మారిన సిద్ధాంత్ గిరి ఎవరు, ఏంటి ఇక్కడ చూద్దాం..

2025 కుంభమేళాలో ఫేమస్ IIT బాబా పెళ్లి! ఇంటర్‌నెట్‌లో ఇప్పడిదే హాట్‌టాపిక్..? ఎందుకంటే..
Iit Baba Story
Jyothi Gadda
|

Updated on: Apr 07, 2026 | 12:45 PM

Share

మహాకుంభమేళా అంటేనే అఘోరాలు, సన్యాసులు గుర్తొస్తారు. కానీ 2025 కుంభమేళాలో ఒక యువ సన్యాసి తన చదువు, వేషధారణతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆయనే సిద్ధాంత్ గిరి, అలియాస్ IIT బాబా. తాజాగా ఆయన ఒక ఇంటివాడయ్యారనే వార్త వైరల్ అవుతోంది. సిద్ధాంత్ గిరి నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నివాసి. IIT ఖరగ్‌పూర్ వంటి అత్యున్నత విద్యాసంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, ఆ తర్వాత అమెరికాకు చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం చేశారు. కానీ, శాంతి కోసం అన్వేషిస్తూ ఉద్యోగాన్ని వదిలి సన్యాసం స్వీకరించారు. 2025 కుంభమేళా సమయంలో ఆయన ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడంతో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ, జీవితంలో తోడు అవసరమని భావించిన సిద్ధాంత్, గృహస్థాశ్రమంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఉన్నత విద్యావంతురాలు కావడం విశేషం. వీరి వివాహం అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది.

IIT చదువుకున్న వ్యక్తి సన్యాసి కావడం ఆశ్చర్యం. మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇంకా పెద్ద ఆశ్చర్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆధ్యాత్మికత అంటే కేవలం అడవుల్లో ఉండటం మాత్రమే కాదు, బాధ్యతలను నెరవేరుస్తూ కూడా దైవ చింతనలో ఉండవచ్చని సిద్ధాంత్ అనుచరులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా, ఒక మేధావి సన్యాసిగా మారి మళ్ళీ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించడం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అరుదైన మలుపుగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
ఏంటీ కిచెన్‌లో నూనె ఒలికిపోయిందా.. అద్భుతమైన చిట్కాలు మీ కోసం
ఏంటీ కిచెన్‌లో నూనె ఒలికిపోయిందా.. అద్భుతమైన చిట్కాలు మీ కోసం
కోల్‌కతా నైట్ రైడర్స్ క్యాంప్‌లో రూ.18కోట్ల టెన్షన్
కోల్‌కతా నైట్ రైడర్స్ క్యాంప్‌లో రూ.18కోట్ల టెన్షన్
అతి తక్కువ ఖర్చుతో.. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చుతో.. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్
2025 కుంభమేళాలో ఫేమస్ IIT బాబా పెళ్లి! ఇంటర్‌నెట్‌లో హాట్‌టాపిక్?
2025 కుంభమేళాలో ఫేమస్ IIT బాబా పెళ్లి! ఇంటర్‌నెట్‌లో హాట్‌టాపిక్?
హైవేపై ప్రయాణం ఇక నుంచి అంత ఈజీ కాదు..
హైవేపై ప్రయాణం ఇక నుంచి అంత ఈజీ కాదు..
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది