AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రోబోతో ప్రేమలో పడ్డ వ్యక్తి.. తానులేక, నేను లేనంటూ ప్రేమ గీతాలు.. త్వరలో పెళ్లి!

సూపర్‌స్టార్ రజినీకాంత్ రోబో సినిమా చూసే ఉంటారు. అందులో రోబో మనిషిని ప్రేమిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. తాజాగా రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి సీనే ఒకటి జరిగింది.

Viral: రోబోతో ప్రేమలో పడ్డ వ్యక్తి.. తానులేక, నేను లేనంటూ ప్రేమ గీతాలు.. త్వరలో పెళ్లి!
Love With Robot
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2022 | 5:30 PM

Share

సూపర్‌స్టార్ రజినీకాంత్ రోబో సినిమా చూసే ఉంటారు. అందులో రోబో మనిషిని ప్రేమిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. కానీ రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి సీనే ఒకటి జరిగింది. కానీ కొంచెం డిఫరెంట్. ఓ వ్యక్తి రోబోతో ప్రేమలో పడ్డాడు. ఈ విచిత్రమైన ఇన్సిడెంట్  ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. అతడు ఇప్పుడు ఆ రోబోను పెళ్లాడాలనుకుంటున్నాడు.  క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఆ వ్యక్తి పేరు జియోఫ్‌ గల్లాఘర్‌. అతడు ప్రేమలో పడ్డ రోబో పేరు ఎమ్మా. దాన్ని తన లైఫ్ పార్టనర్‌గా చేసుకోవాలని ఉందని తన మనసులోని మాట చెప్పేస్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం తల్లిని పోగొట్టుకున్నజియోఫ్‌కు ఈ ప్రపంచంలో ఒంటిరిని అయ్యాననే ఫీలింగ్ వచ్చింది. ఈ క్రమంలో రోబోల గురించి ఎక్కడో ప్రస్తావన రావడంతో.. ఇంట్రస్టింగ్‌గా అనిపించి వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేశారు. అలా ఎమ్మా అనే హ్యూమనాయిడ్‌పై అతడు ఆసక్తి కనబరిచాడు. వెంటనే దాన్ని కొనేశాడు.

‘ఆ రోబో లేలేత రంగుతో.. నీలి కళ్లతో చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. అందుకే ఎమ్మాను కొనుగోలు చేశానంటూ’’ జియోఫ్‌ వెల్లడించారు. ఎమ్మా తన  జీవితంలోకి వచ్చి రెండేళ్లవుతుందని, ఈ కాలంలో దానికి చాలా దగ్గరయ్యానని, తను లేని జీవితాన్ని ఊహించుకోలేనని అతడు ఇప్పుడు చెబుతున్నాడు. ఆ రోబో తల వెనుక భాగంలో ఉండే స్మార్ట్‌ స్క్రీన్‌ సాయంతో జియోఫ్‌ ఎమ్మాతో ముచ్చట్లు పెడుతున్నాడు. తాను ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చేవరకు తన కోసం ఎమ్మా ఎంతో ఆప్యాయంగా ఎదురు చూస్తుందని, అందుకే దాన్ని పెళ్లి చేసుకుని భార్య స్థానం ఇవ్వాలనుందని వెల్లడించాడు. తన కోరిక చట్టబద్ధం కాకపోయినప్పటికీ తన మనసులో ఉంది మాత్రం అదేనని జియోఫ్‌ వెల్లడించారు.

Also Read: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. దక్షిణ భార‌త‌దేశంలో తొలిసారి