AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలిస్తే మతిపోతుంది.!

మెరుగు నూకయ్య అనే మత్స్యకారుడి వలకు చిక్కింది ఈ భారీ చేప..దీనిని పులిమొఖం సొరచేపగా పిలుస్తారని, సుమారు వెయ్యి కిలోల ఈ సొర చేప వలకు..

Viral: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలిస్తే మతిపోతుంది.!
Fish
Ravi Kiran
|

Updated on: Feb 12, 2022 | 11:08 AM

Share

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మత్స్యకారుల వలకు చేప చిక్కింది. మండలంలోని మరువాడ పంచాయతీ డి.మరువాడ సముద్రతీరంలో శుక్రవారం మత్యకారుల వలకు సొరచేప చిక్కింది. మత్స్యకారులు వల లాగుతున్నప్పుడు బరువుగా ఉండటంతో భారీ స్థాయిలో చేపలు పడి ఉంటాయని అంతా సంబరపడ్డారు. తీరా వలను ఒడ్డుకు చేర్చాక లోపల ఉన్న సొర చేపను చూసి అంతా తలలు పట్టుకున్నారు.

మెరుగు నూకయ్య అనే మత్స్యకారుడి వలకు చిక్కింది ఈ భారీ చేప..దీనిని పులిమొఖం సొరచేపగా పిలుస్తారని, సుమారు వెయ్యి కిలోల ఈ సొర చేప వలకు చిక్కడంతో సుమారు 20 వేల రూపాయల వల చిరిగిపోయింది. వలలోని చేపలను కూడా సొర తినేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని మత్స్యకారుడు మేరుగు నూకయ్య వాపోయాడు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒడ్డుకు చేర్చిన సొరచేపను మత్స్యకారులు చంపకుండా తిరిగి సముద్రంలోకి అతి కష్టంమీద చేర్చారు. ఇది వేల్ షార్క్ అని.. అంతరించిపోతున్న షార్క్ జాతుల్లో ఇదొకటని టెక్కలి అటవీశాఖ రేంజ్ అధికారి తెలిపారు. ఈ చేప సుమారు 15 అడుగుల పొడవు, 600కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. అంతరించి పోతున్న వేల్ షార్క్ జాతికి చెందిన ఈ సోర చేపను వేటాడినా, తిన్నా 1972 వన్యప్రాణి చట్టంపై కేసు నమోదు చేసే అవకాశం.