Viral: మట్టి తవ్వుతుండగా వినిపించిన భారీ శబ్దం.. వెలికితీయగా బయటపడ్డ అరుదైన అద్భుతం!

ఇదొక క్రేజీ న్యూస్. ఓ పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం కేటాయించిన స్థలంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టారు...

Viral: మట్టి తవ్వుతుండగా వినిపించిన భారీ శబ్దం.. వెలికితీయగా బయటపడ్డ అరుదైన అద్భుతం!
Viral
Follow us

|

Updated on: May 30, 2022 | 9:21 PM

ఇదొక క్రేజీ న్యూస్. ఓ పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం కేటాయించిన స్థలంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక వారికి షాక్ కలిగించేలా భారీ శబ్డంతో ఓ అరుదైన అద్భుతం బయటపడింది. ఈ అరుదైన సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మెక్సికోలోని యుకాటన్ ప్రాంతానికి ఈశాన్య తీరంలో మెరిడా పట్టణం ఉంది. ఆ పట్టణానికి సమీపంలో ఒక పారిశ్రామిక ప్రాజెక్ట్‌ కోసం ఓ ప్రైవేటు స్థలాన్ని కేటాయించారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఆ స్థలంలో తవ్వకాలు జరపారు. ఇక వారికి షాక్ కలిగించేలా రాజభవనాలు, పిరమిడ్‌లతో కూడిన సుమారు 1500 సంవత్సరాల నాటి ఓల్డ్ మయాన్ నగరం ఒకటి బయటపడింది. ఆ రాజభవనాలు, పిరమిడ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీటిల్లో వివిధ సామాజిక తరగతులకు చెందిన వ్యక్తులు ఉండి ఉంటారని.. పూజారులు, లేఖకులు.. రాజభవనాల్లో ఉండగా.. సాధారణ ప్రజలు మిగిలిన వాటిల్లో నివసించి ఉంటారని ఒక కన్‌క్లూజన్‌కు వచ్చారు.

ఆ ప్రైవేటు భూమిని సొంతం చేసుకున్న యజమానుల్లో ఒకరైన మౌరిసియో మోంటల్వో, తవ్వకాలు జరుపుతున్నప్పుడు భారీ శబ్దంతో ఓ పెద్ద రాయి మట్టిలో తగిలిందని.. ఆ తర్వాత ఈ అపారమైన భవనాలను వెలికితీశామని చెప్పుకొచ్చాడు. కాగా, ఆ వ్యక్తి కొనుగోలు చేసిన స్థలంలో ఈ పురాతన రాజభవనాలను కనుగొనడంతో అతడు నేషనల్ ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ(INAH)కు ఆ సైట్‌ను అప్పగించేశాడు.