Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRTP: ఏడేళ్ల పాలనలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగింది.. వెంటనే రాజీనామా చేయాలి: వైయస్ షర్మిల

ఏడేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగిందని వైయస్ఆర్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల ఆరోపించారు. కళ్ళ ముందు రెండు లక్షల

YSRTP: ఏడేళ్ల పాలనలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగింది.. వెంటనే రాజీనామా చేయాలి: వైయస్ షర్మిల
Sharmila
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 07, 2021 | 9:17 PM

YS Sharmila: ఏడేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగిందని వైయస్ఆర్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల ఆరోపించారు. కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వరని ఆమె ఆరోపించారు. తెలంగాణలో నోటిఫికేషన్లు సకాలంలో వచ్చి ఉంటే యువకుల ఆత్మహత్యలు జరిగేవి కావని షర్మిల చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఓ పెద్ద మోసగాడంటూ షర్మిల హాట్ కామెంట్లు చేశారు.

ప్రతీ మంగ‌ళ‌వారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష ఇవాళ 9వ వారంకు చేరుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ నియోజకవర్గం, మహబూబ్ నగర్ టౌన్, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నేడు షర్మిల దీక్ష చేశారు జోహార్ నిరుద్యోగ అమరవీరులకు అంటూ నినాదాలు చేశారు.

ఉద్యమం అప్పుడు ఏం చెప్పాం, ఇప్పుడేం చేస్తున్నాం అనే సోయి కేసీఆర్‌కు ఉండాలని షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఇచ్చే 35 వేల ఫీజు రియంబర్స్‌మెంట్‌కి ముప్పు తిప్పలు పెడుతున్నారన్నారు.. బోధన సిబ్బంది లేకుండా యూనివర్సిటీలను నడిపిస్తున్న ఘనత కేసీఆర్‌దేనని షర్మిల అన్నారు.

రాష్ట్రంలో 34 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం చూస్తుంటే కేవలం 3 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారని షర్మిల విమర్శించారు. 5 వేలను రైతుబందు పథకంలో ఇచ్చి ఎకరానికి 15 వేలను వడ్డీ రూపంలో రైతుల నుంచి కేసీఆర్ వసూలు చేస్తున్నాడని షర్మిల ఆరోపించారు. బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణ, చావుల తెలంగాణ అయిందన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయలన్నారు. ఏం ఉద్ధరించారని సీఎంగా కేసీఆర్‌ ఉండాలని షర్మిల ప్రశ్నలు కురిపించారు.

Sharmila 2

Sharmila 2

Read also: Oxygen Cylinder Explode: పెట్రోల్ బంక్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్ పేలుడు.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆటో ధ్వంసం