ప్రేమించిన యువతి ఫోన్ ఎత్తట్లేదని.. పని చేసే చోటే ఉరేసుకున్నాడు..
చిన్న చిన్న కారణాలతోనే కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో నిండు జీవితాన్ని కూల్చుకుంటున్నారు. ముందూవెనకా ఆలోచించకుండా...
చిన్న చిన్న కారణాలతోనే కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో నిండు జీవితాన్ని కూల్చుకుంటున్నారు. ముందూవెనకా ఆలోచించకుండా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. తనను నమ్ముకున్న వాళ్ల భవిష్యత్ ను అంధకారంలోకి పడేస్తున్నారు. తాజాగా వరంగల్(Warangal) జిల్లా ఘన్ పూర్ లో బిహార్ కు చెందిన ఓ కార్మికుడు ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. స్వగ్రామానికి చెందిన యువతిని ప్రేమించిన యువకుడు.. తన ప్రియురాలు ఫోన్ ఎత్తట్లేదని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అంతే కాదు..ఆమె మరొకరిని ప్రేమిస్తోందని తెలుసుకుని మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో మిల్లులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
బిహార్ రాష్ట్రం మధువనిలోని బాలువాటోల్ గ్రామానికి చెందిన అమిత్ కుమార్.. వరంగల్ జిల్లాలోని ఘన్పూర్లోని ఓ రైస్మిల్లులో పని చేస్తున్నాడు. అమిత్ తన స్వగ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. రోజూ ఆమెతో ఫోన్ లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆమె అమిత్ ఫోన్ ఎత్తడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమిత్.. అదే ఊర్లో ఉంటున్న తన స్నేహితులను వాకబు చేశాడు. ఆమె మరొకరిని ప్రేమిస్తోందని వారు సమాధానమివ్వడంతో మనోవేదనకు గురయ్యాడు. రాత్రి ఎవరూ లేని సమయంలో మిల్లులోనే ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఉదయం తోటి కార్మికులు గమనించి మిల్లు యజమానికి సమాచారం అందించారు. యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని శవపరీక్ష కోసం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఇవీచదవండి.
కారు బీభత్సం.. హుక్కా మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. చివరికి ఏమైందంటే..