Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizamabad: కార్పొరేటర్ భర్తను చెప్పుతో చెడామడా వాయించిన మహిళ… ఎందుకో తెలిస్తే షాకే

నిజామాబాద్‌లో కార్పొరేటర్ భర్తను చెప్పుతో చెడామాడా కొట్టేసింది ఓమహిళ. అతని ఇంటికే వెళ్లి.. భార్య, పిల్లలు చూస్తుండగానే కోటింగ్ ఇచ్చింది.

Nizamabad: కార్పొరేటర్ భర్తను చెప్పుతో చెడామడా వాయించిన మహిళ... ఎందుకో తెలిస్తే షాకే
Women Slaps A Man
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 13, 2021 | 1:27 PM

నిజామాబాద్‌లో కార్పొరేటర్ భర్తను చెప్పుతో చెడామడా కొట్టేసింది ఓమహిళ. తన కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకుని తమ ఇంట్లో చిచ్చు పెట్టారని ఆరోపిస్తూ… చెప్పుతో నాలుగు తగిలించింది ఆ మహిళ. నిజామాబాద్‌లో కార్పొరేటర్‌ భర్త ఆకుల శీను తమ కూతురిని మోసం చేశాడంటూ ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు. రాత్రి తమ కూతురి ఎత్తుకెళ్లిన కార్పొరేటర్‌ భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని బాధితులు చెబుతున్నారు. గతంలో తమ కూతురిని విడిచిపెట్టాలని మందలించినా తీరు మార్చుకోలేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అతను భార్యకు విడాకులు ఇచ్చి.. తన బిడ్డను చేసుకుంటే ఇబ్బంది లేదని.. కానీ ఇలా చెయ్యడం కరెక్ట్ కాదంటున్నారు యువతి పేరెంట్స్. యువతి పేరెంట్స్ దాడి చేస్తోన్న సమయంలో అతని భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఇరుగుపొరుగు వారు చెప్పినా.. వారు వినే పరిస్థితుల్లో లేకపోవడంతో.. పోలీసులు రంగప్రవేశం చేశారు. సమస్య ఉంటే కేసు పెట్టాలని.. ఇలా గొడవ చేయడం వల్ల ఉపయోగం ఉండదని సర్దిచెప్పారు. కాగా స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. కార్పొరేటర్ భర్త వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: సైబర్‌ మోసాల తర్పీదు కోసం స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్.. రాచకొండ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

2 నెలల క్రితం రోడ్లపై కుప్పలు.. ఇప్పుడేమో కొందామంటే వాతలు.. తాజా ధర తెలిస్తే షాకే