AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నాలుగేళ్లుగా సహజీవనం చేసి మోసం చేసిన ప్రియుడు.. చివరకు యువతి పోలీస్ స్టేషన్‌ ఎదుట..

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పోలీస్‌ స్టేషన్‌ ముందే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెళ్ళిచేసుకుంటానని మాటిచ్చి, సహజీవనం చేసి..

Telangana: నాలుగేళ్లుగా సహజీవనం చేసి మోసం చేసిన ప్రియుడు.. చివరకు యువతి పోలీస్ స్టేషన్‌ ఎదుట..
Women
Shaik Madar Saheb
|

Updated on: Jan 05, 2023 | 9:19 AM

Share

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పోలీస్‌ స్టేషన్‌ ముందే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెళ్ళిచేసుకుంటానని మాటిచ్చి, సహజీవనం చేసి, ఆపై మొహం చాటేసిన యువకుడి నిర్వాకం ఓ నిండు ప్రాణానికి ఎసరు పెట్టింది. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం కుప్పేనకుంట్ల గ్రామానికి చెందిన కంటేపూడి స్వప్న మామిడి నాగరాజుతో గత నాలుగేళ్ళుగా సహజీవనంలో ఉంది. పెళ్లి చేసుకోవాలని స్వప్న ఒత్తిడి తీసుకురావడంతో మోసగాడు నాగరాజు దానికి నిరాకరించాడు.

కొన్ని రోజుల నుంచి బ్రతిమాలాడుతున్నప్పటికీ నాగరాజు వినకపోవడంతో స్వప్న పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అయితే, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది.

దీంతో తనకు న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన స్వప్న పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగు మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది. ఇది చూసిన పోలీసులు బాధితురాలిని వెంటనే పెనుబల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం స్వప్న పరిస్థితి బాగానే ఉందని.. చికిత్స కొనసాగుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..