
ఇంట్లో మనుషులు ఎవరైనా తప్పిపోతేనో.. లేదంటే వాహనాలు, విలువైన వస్తువులు పోతే మిస్సింగ్ అని ప్రచారం చేయడం కామన్… కానీ పిల్లి మిస్సింగ్ ఓరుగల్లులో ఇప్పుడు హార్ట్ టాపిక్గా మారింది… ఆ పిల్లిని పట్టించిన వారికి 15 వేల రూపాయల నజరానా ప్రకటించారు యాజమాని. నగరంలో వెలసిన పిల్లి మిస్సింగ్ పోస్టర్లు చూపర్లను తెగ ఆశ్చర్య పరుస్తున్నాయి.
ఈ విచిత్ర ఘటన హనుమకొండలోని గుడిబండల్ ప్రాంతంలో జరిగింది.. నిశిత అనే యువతి కుటుంబం ఓ నల్ల పిల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.. మూడేళ్ల నుండి పెంచుకుంటున్న ఈ పిల్లి వారి కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది.. ఆ పిల్లి గత వారం నుండి కనిపించడం లేదు.. ఆ పిల్లి ఏమైపోయిందో తెలియక కుటుంబమంతా తల్లడిల్లిపోతున్నారు.
పిల్లి ఫోటోలతో పోస్టర్లు ముద్రించిన నిషిత ఆ ప్రాంతమంతా ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించారు.. పిల్లిని పట్టించిన వారికి 15 వేల రూపాయల నజరానా ప్రకటించారు.. నల్ల పిల్లి ఫోటోలు పోస్టర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ పిల్లి అంటే తనకు ప్రాణం అంటున్న నిశిత తన పిల్లిని పట్టించిన వారికి 15 వేలు కాదు అవసరమైతే 20 వేలు కూడా ఇస్తానంటుంది.. ఇక్కడ మూగజీవులపై ప్రేమను మాత్రమే చూడాలని.. ఆ పిల్లితో పెనవేసుకున్న అనుమబంధమే తనను మానసికంగా కుంగిపోయేలా చేస్తుందని యాజమాని నిశిత ఆవేదన వ్యక్తం చేస్తుంది.
Missing Cat
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి