AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy – KCR: సీఎం సారు.. వీటి సంగతేంటి.. కేసీఆర్‌కు మరోసారి లేఖాస్త్రాన్ని సంధించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణలో లేఖల రాజకీయం జోరు తగ్గట్లేదు. కొద్దిరోజులుగా భారతీయ జనతా పార్టీ-టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైర్ జోరందుకోవడంతో.. ఇరు పార్టీలకు చెందిన నేతలు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు.

Kishan Reddy - KCR: సీఎం సారు.. వీటి సంగతేంటి.. కేసీఆర్‌కు మరోసారి లేఖాస్త్రాన్ని సంధించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy Kcr
Balaraju Goud
|

Updated on: Feb 21, 2022 | 7:03 AM

Share

Minister Kishan Reddy urges CM KCR: తెలంగాణ(Telangana)లో లేఖల రాజకీయం జోరు తగ్గట్లేదు. కొద్దిరోజులుగా భారతీయ జనతా పార్టీ(BJP)-టీఆర్ఎస్(TRS) మధ్య పొలిటికల్ ఫైట్ జోరందుకోవడంతో.. ఇరు పార్టీలకు చెందిన నేతలు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రానికి రావల్సి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం మండిపడుతుంటే.. ఇచ్చిన నిధులను ఏం చేశారో చెప్పాలంటూ కేంద్ర సర్కార్ వివరణ లేఖలతో రాజకీయ యుద్ధం ప్రకటిస్తోంది.

కొన్నాళ్లుగా తెలంగాణలో గులాబీ వర్సెస్‌ కమలం వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు సంధించుకున్నారు. కేంద్రంపై తెలంగాణ మంత్రులు, తెలంగాణ సర్కార్‌పై కేంద్ర మంత్రులు లెటర్‌ వార్‌ ప్రకటించారు. తాజాగా మరో కీలక అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. 2022-23 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో, తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.3వేల 48కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైల్వే పనుల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల 420 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వచ్చే ఆర్థిక సంవత్సంలో కేటాయింపులను 25 పెంచినట్లు వెల్లడించారు. అలాగే, 2014-20 మధ్య కాలంలో కేటాయించిన సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కంటే 3 రెట్లు అధికంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు చేశారని చెప్పారు కిషన్‌రెడ్డి. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులకు సంబంధించిన వివరాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు కేంద్రమంత్రి.

తెలంగాణ వ్యాప్తంగా 1300 కిలోమీటర్లకు పైగా రైల్వే పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఈ సమస్యలపై చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించాలని కోరారు కిషన్‌రెడ్డి. తెలంగాణ ప్రజలకు రైల్వేలను మరింత చేరువ చేయడానికి సహకరించాలని కోరుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునికీకరణలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాల చేపడుతున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అటు తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్ లైన్ల నిర్మాణం, అవసరమున్న చోట మూడో లైన్ నిర్మాణం, రైల్వే లైన్ల విద్యుద్దీకరణ, రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

Read Also…

CM KCR: నేడు నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన.. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో