AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: దిల్‎సుఖ్‎నగర్‎లో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన రెండు బస్సులు..

హైదరాబాద్‎లో ఆగి ఉన్న రెండు బస్సులు మంటలకుగురై పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దిల్‎సుఖ్‎నగర్ బస్ డిపోలో నిలిపి ఉంచిన రెండు బస్సులు పూర్తిగా దగ్థమయ్యాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. మంటలను గమనించిన బస్సు డిపో సెక్యూరిటీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Fire Accident: దిల్‎సుఖ్‎నగర్‎లో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన రెండు బస్సులు..
Fire Accident
Srikar T
|

Updated on: Jan 22, 2024 | 5:33 PM

Share

హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్‎లో ఆగి ఉన్న రెండు టీఎస్ ఆర్టీసీ బస్సులు మంటలకుగురై పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దిల్‎సుఖ్‎నగర్ బస్ డిపోలో నిలిపి ఉంచిన రెండు బస్సులు పూర్తిగా దగ్థమయ్యాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. మంటలను గమనించిన బస్సు డిపో సెక్యూరిటీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపు అందుబాటులో ఉన్న వాటితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు మలక్‎పేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బ్యాటరీలోని కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు ఫైర్ సిబ్బంది. అయితే పూర్తి స్థాయిలో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు డిపో అధికారులు. ప్రమాదానికి గురైన రెండు బస్సులు ఆర్టీసీవే కావడం గమనార్హం. ఫైర్ యాక్సిడెంట్‎కు గల ప్రధాన కారణం తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..