Telangana: సజ్జనార్ మరో వినూత్న ప్రయోగం.. రైతులకు, ఆర్టీసీకి కలిసి వచ్చేలా ఇంటికే మామిడి పళ్లు..

Telangana: తెలంగాణ ఆర్టీసీ(TS RTC) సరికొత్త ప్రయోగాలతో లాభార్జన వైపు పరుగులు తీస్తోంది. ఎండీ సజ్జనార్ (MD Sajjanar) తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సంస్థను క్రమంగా ప్రజలకు..

Telangana: సజ్జనార్ మరో వినూత్న ప్రయోగం.. రైతులకు, ఆర్టీసీకి కలిసి వచ్చేలా ఇంటికే మామిడి పళ్లు..
Tsrtc Mangoes
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 5:18 PM

Telangana: తెలంగాణ ఆర్టీసీ(TS RTC) సరికొత్త ప్రయోగాలతో లాభార్జన వైపు పరుగులు తీస్తోంది. ఎండీ సజ్జనార్ (MD Sajjanar) తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సంస్థను క్రమంగా ప్రజలకు చేరువ చేస్తూ లాభాల బాట ఎక్కించేందుకు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం కొత్త సర్వీసులు, ట్రిప్పులు, ఆఫ‌ర్లతో ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువ చేస్తున్నారు. తాజాగా ఆయన మ‌రో స‌ర్వీసుతో ముందుకు వ‌చ్చారు. మధురమైన మామిడిపండ్లు తోట నుంచి నేరుగా ఇంటి వద్దకే డెలివ‌రీ చేయ‌నున్నట్లు ట్విట‌ర్ వేదిక‌గా తెలిపారు. టీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ ద్వారా ఈ స‌ర్వీసు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. చెమటోడ్చి ఆకలిని తీర్చే.. అన్నదాత రైతన్నను ఆదుకోండి అంటూ ట్వీట్‌లో కోరారు.

మామిడి పండ్లను పోస్టల్ ద్వారా డెలివరీ తీసుకోవాలనుకునే వినియోగదారులు కిలోకు రూ.115 చెల్లించాల్సి ఉంది.  ఒకరు 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు లేదా టన్నులలో ఆర్డర్ చేయవచ్చు. బుకింగ్‌ల కోసం https://www.tsrtcparcel.in/ TSCounter/Account/Products ని సందర్శించాలని సూచించారు. లేదా 040-2345003, 040-69440000 నంబర్లలో సంప్రదించాలని కోరారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: World Asthma Day: కాలుష్యంతో పిల్లల్లో పెరుగుతున్న ఆస్తమా.. ప్రపంచంలోనే మనదేశంలోనే అత్యధిక కేసులు

MP Sanjeev Kumar: ఎంపీని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు .. పాన్ కార్డు అప్డేట్ చేసుకోమని డబ్బులు డ్రా