AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: ఢిల్లీలో కోలాహలంగా బీఆర్ఎస్ కార్యాలయం.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత..

ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. కార్యాలయం ఉన్న ఎస్పీ మార్గ్ పూర్తిగా గులాబీయయం అయ్యింది. మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

BRS: ఢిల్లీలో కోలాహలంగా బీఆర్ఎస్ కార్యాలయం.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత..
Delhi Brs Office
Shiva Prajapati
|

Updated on: Dec 14, 2022 | 11:56 AM

Share

ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. కార్యాలయం ఉన్న ఎస్పీ మార్గ్ పూర్తిగా గులాబీయయం అయ్యింది. మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోమం దగ్గర ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు.

ఇక తెలంగాణలో పుట్టి తెలంగాణ గడ్డపై సర్వశక్తులూ ఒడ్డి, పార్టీని బలోపేతం చేసుకున్న టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా అవతరించి, ఇప్పుడు హస్తినలో అడుగుమోపబోతోంది. పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యజ్ఞయాగాదులతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వేదపండితులు నిర్ణయించిన దివ్యముహూర్తం ప్రకారం ఢిల్లీలో హోమాలు.. యజ్ఞయాగాలతో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.

సరిగ్గా 12గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల మధ్య జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆఫీస్‌ను ప్రారంభించి….తన గదిలో కూర్చుంటారు CM కేసీఆర్.ప్రారంభోత్సవ కార్యక్రమానికి పంజాబ్, హ‌ర్యానా, యూపీ, ఒడిశా, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన రైతు నేతలు రాబోతున్నారు. కర్నాటక మాజీ CM కుమార‌స్వామి, UP మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..