TRS Foundation Day Highlights: రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలు ఎందుకు.. ప్లీన‌రీ వేదిక‌గా సీఎం కేసీఆర్

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 27, 2022 | 3:51 PM

CM KCR Speech Live Updates: TRS 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా TRS పార్టీ కుటుంబ సభ్యులకు MLC క‌ల్వకుంట్ల క‌విత‌ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర సాధనలో ప్రధాన కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

TRS Foundation Day Highlights: రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలు ఎందుకు.. ప్లీన‌రీ వేదిక‌గా సీఎం కేసీఆర్
Cm Kcr At Trs Party Plenary

ధూమ్‌ధామ్‌గా 21 ఏళ్ల గులాబీ ఆవిర్భావ సభ..ప్లీనరీ వేదికపై TRS జెండా ఆవిష్కరించారు CM KCR..ఆ తర్వాత అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు..కేసీఆర్‌ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. 3 వేల మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.. ప్లీనరీకి వచ్చేవారికి ప్రత్యేక పాస్‌లు LED స్క్రీన్లతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. TRS‌ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోటన్నారు CM KCR‌. ఎవ్వరూ బద్దలు కొట్టని కోటని..TRS‌ తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు. 60లక్షల మంది పార్టీ శ్రేణులతో.. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులున్న పార్టీ TRS‌ అన్నారు. దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ పాలన ఉందన్నారు KCR..దేశంలో అతి ఉత్తమమైన 10 గ్రామాలు తెలంగాణవే అన్నారు..

TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి KTR గులాబీ జెండాను ఆవిష్కరించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్కర‌ణ కార్యక్రమంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, MLA దానం నాగేంద‌ర్‌ తో పాటు TRS పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కర‌ణ అనంత‌రం KTR కేక్ క‌ట్ చేశారు. తెలంగాణ ప్రజల గుండెల నిండా గులాబీ జెండా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు ..TRS పార్టీ నాయకులు, కార్యకర్తలకు TRS ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.TRS పార్టీ జాతీయ రాజకీయాల్లో కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాం అన్నారు హరీష్‌..ప్రశాంత్‌కిషోర్‌తో కలిసి బీజేపీ, కాంగ్రెస్ పనిచేయలేదా మేము పనిచేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Apr 2022 01:14 PM (IST)

    పార్టీలో జాతీయ రాజకీయాల వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలిగా కవిత

    టీఆర్ఎస్‌ పార్టీలో జాతీయ రాజకీయాల వ్యవహారాల కమిటీ ఏర్పాటు.. కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత నియామకం

  • 27 Apr 2022 12:49 PM (IST)

    చదువుకున్న వాళ్లకు సైతం చాలా విషయాలు దూరంలోనే..

    తెలిసిన దాని చుట్టే ఆలోచనలు తిరుగుతున్నాయి. చదువుకున్న వాళ్లకు సైతం చాలా విషయాలు దూరంలోనే ఉన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఏం జరిగందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ పద్ధతిలో స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో లభించలేదు.

  • 27 Apr 2022 12:48 PM (IST)

    లక్ష్యరహిత దేశంగా భారత్‌ ముందుకెళ్తోంది..

    దేశం తన లక్ష్యం కోల్పోయింది. లక్ష్యరహిత దేశంగా భారత్‌ ముందుకెళ్తోంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి ఏకతాటిగా భారత్‌ ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోంది? సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సీఎం కేసీఆర్‌.

  • 27 Apr 2022 12:47 PM (IST)

    అన్నీ మనకే తెలుసన్న అహంకారం పక్కనపెట్టాలి..

    అన్నీ మనకే తెలుసన్న అహంకారం పక్కనపెట్టాలి.. తెలిసిన వాళ్లను తెలియని వివరాలు అడిగి నేర్చుకోవాలి. అలా చేయబట్టే తెలంగాణ ప్రతీ రంగంలో అవార్డులు సాధిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

  • 27 Apr 2022 12:35 PM (IST)

    టీఆర్ఎస్‌ పార్టీ బీఆర్ఎస్‌గా చేయాలని..

    టీఆర్ఎస్‌ పార్టీ బీఆర్ఎస్‌గా చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారతీయ రాష్ట్ర సమితి చేయాలని అంటున్నారు. దేశంలో రాజకీయ ఫ్రంట్లు ఏం సాధించాయని ప్రశ్నించారు. ప్రజలే అజెండాగా ఫ్రంట్లు రావాలి. మన రాష్ట్రం నుంచి ఏదైనా జరిగితే మనకు గర్వకారణం. దేశం గతి, స్థితిని మార్చడానికి హైదరాబాద్ వేదిక మారుతుందన్నారు.

  • 27 Apr 2022 12:34 PM (IST)

    కత్తుల కోలాటాలు ఎవరికి కావాలి.. - సీఎం సీఆర్

    విమానాలు దిగుతూనే కత్తలతో ర్యాలీలు నిర్వహించడం ఇదెక్కడి పద్దతని అని ప్రశ్నించారు.

  • 27 Apr 2022 12:28 PM (IST)

    బెంగళూరులో ఏం జరుగుతోంది.. - సీఎం కేసీఆర్

    దేశంలో ఏం జరుగుతోంది. ఇలా విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి. రాజకీయ పబ్బం కోసమే కొందరు ప్రజలను రెచ్చగొడుతున్నారు. బెంగళూరులో ప్రతి రోజు ఒక్కో వివాదం తెరమీదికి వస్తోంది. ఇదేం పద్దతి అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

  • 27 Apr 2022 12:24 PM (IST)

    మహాత్మాగాంధీని దూషించడం.. ఆయన హతకులను పూజించడం..

    మహాత్మాగాంధీని దూషించడం ఏంటని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనను చంపిన వ్యక్తులకు పూజలు చేయడం ఏంటన్నారు. దేశంలో మత విద్వేషాలు తీసుకురావడం ఎంతవరకు మంచిదని అన్నారు.

  • 27 Apr 2022 12:18 PM (IST)

    రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలు ఎందుకు..

    ఈ దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్క‌లంగా ఉండ‌గా.. రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా సీఎం కేసీఆర్ దేశంలోని నీటి వ‌న‌రుల‌పై ప్రశ్నించారు.

  • 27 Apr 2022 11:59 AM (IST)

    పార్టీని గద్దె దించటానికి రాను.. కమ్యూనిస్ట్ నేతలకు తేల్చిన చెప్పాను - సీఎం కేసీఆర్

    కమ్యూనిస్ట్ నేతలు నన్ను కలిశారు. బిజెపిని గద్దె దించడానికి మాతో కలిసి రావాలని వామపక్ష నేతలు నన్ను కోరారు. మీది చెత్త ఐడియా.. ఎవరినో గద్దె దించటానికి రాను.. ప్రజలను గద్దె ఎక్కించడానికి వస్తా అని చెప్పాను.

  • 27 Apr 2022 11:55 AM (IST)

    తెలంగాణ జలబండగారం.. వెలుగు జిలుగుల..

    తెలంగాణ జలబండగారం అయింది. అవినీతి తో వికెట్ పడే మంత్రులు తెలంగాణలో లేరు. 3మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణ 33మెడికల్ కాలేజీలు నిర్మించుకుంటున్నం. టీఆర్ఎస్ పని చేసిన తీరుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరు ఉంటే 14లక్షల కోట్ల జిడిపి ఉండేది.. దేశంలో స్వతంత్ర ఫలాలు అందరికీ లభించలేదు..పెడదోరని దేశంలో పెరుగుతోంది. 4,01,035 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్ధ్యం దేశానికి ఉంది.. గుజరాత్ లో కరెంట్ కోతలు, రైతుల రాస్తారోకో లు.. మన చుట్టూ అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలే అన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరేళ్ల కాలంలో వెలుగు జిలుగుల తెలంగాణను ఆవిష్కరించాము. దేశంలో కరెంట్ కోతలు ఎందుకు ఉన్నాయి. దేశ నదుల్లో నీటి లభ్యత 65వేల టిఎంసి. 30వేల టీఎంసీల ను మాత్రమే దేశం వినియోగించు కుంటుంది. ఎందుకు ఈ దౌర్భాగ్యం. లోపం ఎక్కడ ఉంది. దేశం తాగు నీరు, సాగు నీరు లేదు, మౌలిక వసతులు లేవు. దీనికి ఎవరి అసమర్థ కారణం.. దీని మీద చర్చ జరగాలి, పరిష్కారం లభించాలి. అందుకోసం మనం మన పాత్ర పోషించాలి.

  • 27 Apr 2022 11:47 AM (IST)

    కేంద్రాన్ని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్

    ప్లీనరీలో కేంద్రంపై ప్రశ్నలు వర్షం కురపించారు సీఎం కేసీఆర్. దేశంలో ఎందుకు కరెంట్ కోతలు ఉన్నాయంటూ ప్రశ్నించారు.

  • 27 Apr 2022 11:38 AM (IST)

    తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు.. - సీఎం కేసీఆర్

    తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు. డబ్బాలు కొట్టుకోవడం, అతిగా పొగుడుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదు. దేశంలో పది ఉత్తమమైన గ్రామాలు తెలంగాణావే. కేంద్రం ఇచ్చిన ఈ సర్టిఫికెట్టే అందుకు నిదర్శనం అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

  • 27 Apr 2022 11:32 AM (IST)

    తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్ఎస్..

    తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. దేశంలో పది అత్యుత్తుమ గ్రామాలు తెలంగాణవే అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రశంసించింది. ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనితీరుకు ఈ ఫలితాలే నిదర్శనం అని అన్నారు. అవార్డు, రివార్డు రాని తెలంగాణ డిపార్ట్‌మెంట్ లేదు.

  • 27 Apr 2022 11:30 AM (IST)

    అమ‌ర‌వీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ పుష్పాంజ‌లి

    టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ ప్రాంగ‌ణానికి ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. ప్లీన‌రీ స‌భా వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, హ‌రీశ్‌రావు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, శ్రీనివాస్ గౌడ్, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గువ్వ‌ల బాల‌రాజు, బాల్క సుమ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

  • 27 Apr 2022 11:30 AM (IST)

    ప్ర‌జ‌ల గుండెల నుంచి ఈ గులాబీ జెండా

    రెండు ద‌శాబ్దాల క్రితం ఏడుపు వ‌స్తే కూడా ఎవ‌ర్నీ ప‌ట్టుకొని ఎడ్వాలో తెలువ‌ని ప‌రిస్థితి అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అస్థిత్వ‌మే ఆగ‌మ‌యైపోయే ప‌రిస్థితి. ఒక దిక్కుతోచ‌ని సంద‌ర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిప‌డింది. అప‌జ‌యాలు, అవ‌మ‌నాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న త‌ర్వాత ప్ర‌జ‌ల దీవెనతో అద్భుత‌మైన పరిపాల‌న అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడ‌ల్‌గా తెలంగాణ నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.

  • 27 Apr 2022 11:29 AM (IST)

    టీఆర్‌ఎస్‌ క్రియాశీల పాత్ర పోషించే సమయం ఇదే - ఎంపీ కేకే

    దేశంలో జరుగుతున్న దారుణాలపై సీఎం కేసీఆర్‌ యుద్ధం ప్రకటించడం శుభసూచకమని TRS ఎంపీ కే కేశరావు అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ తరహా అభివృద్ధి నమూనా అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటానికి పూనుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. HICCలో జరుగుతున్న TRS ప్లీనరీలో ఎంపీ కేకే స్వాగతోపన్యాసం చేశారు. అసమర్ధ కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న పోరాటంలో టీఆర్‌ఎస్‌ క్రియాశీల పాత్ర పోషించే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా తెలంగాణ సమాజం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

  • 27 Apr 2022 11:26 AM (IST)

    టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల ఆస్తి- సీఎం కేసీఆర్

    టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల ఆస్తి అని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.

  • 27 Apr 2022 11:12 AM (IST)

    ప్లీనరీ కార్యక్రమానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌

    ప్రగతిభవన్‌ నుంచి ప్లీనరీ కార్యక్రమానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్‌. పార్టీ అధినేత రాకతో హెచ్‌ఐసీసీ ప్రాంగణం సందడిగా మారింది.

  • 27 Apr 2022 10:54 AM (IST)

    ప్లీనరీ కోసం 2500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు

    TRS ప్లీనరీ కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందితో బందోబస్తు నిర్వహస్తున్నారు. HICCలో ఉన్న 200 CC కెమెరాలను సైబరాబాద్‌ కమాంట్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు.TRS ప్లీనరీ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. వాహనదారులందరూ ట్రాఫిక్‌ ఆంక్షలు పాటించి సహకరించాలని పోలీసులు అధికారులు కోరారు.

  • 27 Apr 2022 10:53 AM (IST)

    ఈ వేధిక నుంచే 2023 ఎన్నికల వ్యూహం..

    ఈ సమావేశంలో TRS పార్టీకి కీలకం కానుంది. ఈ వేధిక నుంచే 2023 ఎన్నికల వ్యూహాన్ని రచించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశ రాజకీయాలపైనా కూడా బ్లూ ప్రింట్‌ను ఆవిష్కరించునున్నారు. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలుండటం.. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు.. ప్రశాంత్‌ కిశోర్‌ ఎంట్రీ.. కేంద్రంతో పోరు.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం..వంటి అంశాల మధ్య ఈ ప్లీనరీ జరుగుతోంది.

  • 27 Apr 2022 10:38 AM (IST)

    జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర.. మంత్రి హరీష్ వ్యాఖ్యలు

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో టీఆర్ఎస్ కలిసి పనిచేస్తే తప్పేంటని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో కాంగ్రెస్, బీజేపీలతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. తప్పనిసరిగా భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తంచేశారు.

  • 27 Apr 2022 10:28 AM (IST)

    తెలంగాణ భవన్‌లో సందడి.. టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన మంత్రి కేటీఆర్

    పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 40 అడుగుల TRS పార్టీ జెండాను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఎగురవేశారు. TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ 40 అడుగుల పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ కేక్ కట్ చేశారు. తెలంగాణ పాటలు, బాణసంచా చప్పుళ్ళ తో  తెలంగాణ భవన్ సందడిగా మారింది. TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

  • 27 Apr 2022 10:22 AM (IST)

    సీఎం కేసీఆర్ రేర్ ఫోటో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

    టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రేర్ ఫోటోను మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.

  • 27 Apr 2022 10:19 AM (IST)

    టీఆర్ఎస్ శ్రేణులు, గులాబీ అభిమానులకు మంత్రి హరీష్ శుభాకాంక్షలు

    టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు, దేశ విదేశాల్లోని గులాబీ అభిమానులకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

  • 27 Apr 2022 10:15 AM (IST)

    సీఎం కేసీఆర్ రేర్ వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత

    టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ రేర్ వీడియోను ఎమ్మెల్సీ కే.కవిత ట్విట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న మన కేసీఆర్ ఆధునిక గాంధీగా అభివర్ణించారు.

  • 27 Apr 2022 10:12 AM (IST)

    పార్టీ ప్రతినిధులకు టీఆర్ఎస్ స్వాగతం..

    పార్టీ ప్లీనరీలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న పార్టీ శ్రేణులకు సోషల్ మీడియా వేదికగా స్వాగతం పలికిన టీఆర్ఎస్.

  • 27 Apr 2022 10:11 AM (IST)

    కేంద్ర వైఫల్యాలపై ఈ మూడు తీర్మానాలు

    ఈ సమావేశంలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. వీటిలో మూడు రాజకీయ తీర్మానాలు ఉంటాయ్. తెలంగాణపై కేంద్రం వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక, లేదా కొత్త పార్టీ. ఇక దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలు.. వంటి అంశాలపై ఈ మూడు తీర్మానాలు ఉండబోతున్నాయి. వీటితో పాటు TRS అభివృద్ధి, సంక్షేమం, దళిత బంధు, భారీగా ఉద్యోగ నియామకాలు, విజయాలు, పురస్కారాలు తదితర అంశాలపై మిగిలిన తీర్మానాలుంటాయని సమాచారం.

  • 27 Apr 2022 10:10 AM (IST)

    ఇక 11 గంటలకు CM KCR తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి

    21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుగుతోంది..ఇక 11 గంటలకు CM KCR తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ప్లీనరీని ప్రారంభిస్తారు.ఆ వెంటనే KCR ప్రసంగం ఉంటుంది. అనంతరం వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు.

  • 27 Apr 2022 10:09 AM (IST)

    వచ్చే ఎన్నికల లోపు ఏం చేయబోతున్నారో అనే దానిపై క్లారిటీ..

    రాజకీయ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల లోపు ఏం చేయబోతున్నారో అనే దానిపై క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ భవన్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జెండా ఎగురవేశారు. హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాలు మొత్తం గులాబీమయంగా మారాయి.

  • 27 Apr 2022 10:09 AM (IST)

    టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

    తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ప్లీనరీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు అమలు చేస్తున్నారు.  పూర్తి వివరాలు తెలుసుకోండి..

  • 27 Apr 2022 09:56 AM (IST)

    ధూమ్‌ధామ్‌గా గులాబీ ఆవిర్భావ సభ

    21 ఏళ్ల గులాబీ ఆవిర్భావ సభ ధూమ్‌ధామ్‌గా నిర్వహిస్తున్నారు. హైటెక్‌ హంగులతో ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ కన్వెన్షన్‌ హల్లోకి మూడు వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉంది. బార్‌కోడ్‌తో కూడిన ఐడెంటిటీ కార్డులు ఇప్పటికే జారీ చేశారు.

  • 27 Apr 2022 09:28 AM (IST)

    నోరూరించే వంటకాలు ఇవే..

    ప్లీనరీకి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. మొత్తం 33రకాల వెరైటీలను ఏర్పాటుచేశారు. తెలంగాణ రుచులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను వేడివేడిగా వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. వెజ్‌, నాన్‌వెజ్‌ స్పెషల్స్‌, తెలంగాణ నాటుకోడి కూర, చికెన్‌ ధమ్‌ బిర్యానీ, మటన్‌కర్రీ, గుత్తి వంకాయ, రోటీ పచ్చళ్లను సిద్ధం చేశారు.

  • 27 Apr 2022 09:27 AM (IST)

    అతిథులకు స్పెషల్‌ మెనూ రెడీ..

    TRS ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయంగా మారింది. భాగ్యనగర నేతలు..HICC పరిసరాలతోపాటు.. పలు కూడళ్లలో భారీగా గులాబీ జెండా తోరణాలు, KCR, KTR కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు.TRS ప్లీనరీ కోసం పసందైన వంటలు రెడీ అయ్యాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అతిథులకు స్పెషల్‌ మెనూ సిద్ధమైంది. ప్లీనరీ ప్రాంగణం రుచికరమైన వంటకాలతో ఘుమఘుమలాడుతోంది.

  • 27 Apr 2022 09:25 AM (IST)

    నగరంలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు..

    TRS ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్‌ గులాబీ మయంగా మారింది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు దర్శనమిస్తున్నాయి.అలంకరణ తోరణాలు, బ్యానర్లతో కొత్త కళ సంతరించుకుంది. అదే స్థాయిలో సమావేశాలకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్- మాదాపూర్‌లోని HICCలో ఈ సమావేశం జరుగుతోంది.

  • 27 Apr 2022 09:25 AM (IST)

    గులాబీ పండుగకు వస్తున్న..

    ఈ గులాబీ పండుగకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, DCCB, DCMS అధ్యక్షులు, జిల్లాల గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, మున్సిపల్ మేయర్‌లు, చైర్మన్లు, ZPTC సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాల, మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు హాజరైయ్యారు.

  • 27 Apr 2022 09:21 AM (IST)

    దేశ రాజకీయాలపైనా కూడా బ్లూ ప్రింట్‌..

    పార్టీ చీఫ్, CM KCR అధ్యక్షతన ఈ పండుగ జరుగుతుంది..ఈ సమావేశంలో TRS పార్టీకి కీలకం కానుంది. ఈ వేధిక నుంచే 2023 ఎన్నికల వ్యూహాన్ని రచించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశ రాజకీయాలపైనా కూడా బ్లూ ప్రింట్‌ను ఆవిష్కరించునున్నారు.ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈ ప్లీనరీ తీర్మానాలు ఉండేలా తెలుస్తోంది.

  • 27 Apr 2022 09:18 AM (IST)

    గులాబీమయంగా భాగ్యనగరం.. 21వ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం

    TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భాగ్యనగరం గులాబీమయంగా మారింది.గులాబీ పార్టీ 21వ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం చేశారు నేతలు.వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలుండటం, MLAల పనితీరుపై నివేదికలు, ప్రశాంత్‌ కిశోర్‌ ఎంట్రీ, కేంద్రంతో పోరు, అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఈ ప్లీనరీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Published On - Apr 27,2022 9:16 AM

Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు