Telugu News Telangana TRS Formation Day CM KCR TRS party completes 21 years unveils national agenda with these resolutions full details
TRS Foundation Day: జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్.. సమావేశంలో ప్రవేశ పెట్టనున్న తీర్మానాలు ఇవే..
TRS Foundation Day: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆవిర్భావ దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మరికాసేపట్లో ప్లీనరీ సమావేశం జరగనుంది.
Trs Foundation Day
Follow us on
TRS Foundation Day: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆవిర్భావ దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మరికాసేపట్లో ప్లీనరీ సమావేశం జరగనుంది. దీంతో హైదరాబాద్ గులాబీ మయంగా మారింది. హైదరాబాద్ HICCలో జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేదిక నుంచి.. పలు అంశాలతో పాటు 2023 ఎన్నికల వ్యూహం గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా.. పార్టీ 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని CM KCR తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ప్లీనరీని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే KCR ప్రసంగం ఉంటుంది. అనంతరం వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వీటిపై చర్చించి ఆమోదించనున్నారు.
ఈ సమావేశంలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. వీటిలో రాజకీయ తీర్మానాలు, తెలంగాణపై కేంద్రం వివక్ష తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం.
దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం.
ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం.
బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం.
రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్ లోనే పన్నులు వసూలు వసూలు చేయాలని తీర్మానం.
నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్వహించాలని ఈమేరకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం.
తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం.