Telangana Rainfall: తెలంగాణ రాష్ట్రంలోని ఆ ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు.. వెల్లడించిన వాతావరణ శాఖ

Telangana Rainfall: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు తెలంగాణలోనూ వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా..

Telangana Rainfall: తెలంగాణ రాష్ట్రంలోని ఆ ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు.. వెల్లడించిన వాతావరణ శాఖ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:58 PM

Telangana Rainfall: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు తెలంగాణలోనూ వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తి దిగువన వదులుతున్నారు. ఇక రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం అధికంగా నమోదైంది. 21 జిల్లాల్లో అధిక వ‌ర్షపాతం (20 నుంచి 50 శాతం మ‌ధ్యలో) న‌మోదు కాగా, ఏడు జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్షపాతం న‌మోదైంది. ఏ ఒక్క జిల్లాల్లోనూ వర్షపాతం తక్కువ నమోదైనట్లు లేదు. అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి.

జూన్ 5వ తేదీన రాష్ట్రాన్ని నైరుతి రుతుప‌వ‌నాలు తాకాయి. వారం రోజుల ముందే నైరుతి రుతుప‌వ‌నాలు రాష్ట్రంలో విస్తరించాయి. ఇప్పటికీ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు యాక్టివ్‌గా ఉన్నాయి. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబ‌ర్ 12వ తేదీ వ‌ర‌కు 873.9 మి.మీ. వ‌ర్షపాతం (సాధార‌ణ వ‌ర్షపాతం 650.9 మి.మీ.) న‌మోదైంది. అంటే సాధార‌ణ వ‌ర్షపాతం కంటే 34 శాతం ఎక్కువ న‌మోదు అయ్యింది. గ‌త సంవత్సరం ఇదే స‌మ‌యానికి 863.9 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో..

కాగా, ఈ సంవత్సరం సిద్దిపేట జిల్లాలో 95 శాతం, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం, వ‌రంగ‌ల్ అర్బన్‌లో 75 శాతం, నారాయ‌ణ‌పేట‌లో 72 శాతం, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 64 శాతం అధిక‌ వ‌ర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక సూర్యాపేట, ములుగు, నాగ‌ర్‌క‌ర్నూల్, సంగారెడ్డి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో సాధార‌ణ వ‌ర్షపాతం నమోదు అయ్యింది.

రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ మీదుగా ప్రయాణించి.. 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నట్టుగా తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఇక ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.

ఇవీ కూడా చదవండి: Rain Alert: తెలంగాణకు మరోసారి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు..

Booster Dose: మూడో డోసు కరోనా వ్యాక్సిన్‌ అవసరం లేదు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు