AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: చంద్రబాబు పేరుతో ఫేక్ లెటర్ వైరల్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన టీడీపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో వెలువడిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ లేఖ తెగ వైరల్ అవుతోంది. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నెట్టింట ఫేక్ లేఖను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Telangana Election: చంద్రబాబు పేరుతో ఫేక్ లెటర్ వైరల్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన టీడీపీ
Tdp Complaint To Police Copy
Balaraju Goud
|

Updated on: Nov 10, 2023 | 12:55 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో వెలువడిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ లేఖ తెగ వైరల్ అవుతోంది. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నెట్టింట ఫేక్ లేఖను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ సైబర్‌ డీసీపీ కవితకు కలిసిన టీడీపీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న ఫిర్యాదు చేశారు.తెలుగు దేశం పార్టీ అధినేత పేరుతో లెటర్‌ హెడ్‌తో నకిలీ లేఖను విడుదల చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ అధినేత సూచినట్లు సమాచారం. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టు, జైలులో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని ఆ పార్టీ భావించింది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు భావించినట్టు సమాచారం. కానీ నకిలీ లేఖతో తమ విధానానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తోంది. దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు జ్యోత్స్న. ఈ లేఖను వైఎస్సార్‌సీపీకు చెందిన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేస్తున్నారని వివరించారు.

సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్న ఫేక్ లెటర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. కుల,మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చంద్రబాబు నాయుడు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని మండిపడ్డారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరోవైపు సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రచారం చేస్తున్న లేఖ ఫేక్ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సైతం క్లారిటీ ఇచ్చారు. ఈ లేఖపై ఫిర్యాదు చేసేందుకు సీఐడీ ఉన్నతాధికారులు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ట రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఫేక్ లేఖను సృష్టించి నెట్టింట వైరల్ చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..
ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లకు RTO లేదా లైసెన్స్ అవసరం లేదు..
ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లకు RTO లేదా లైసెన్స్ అవసరం లేదు..