AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అదిరే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. రాబోయే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకంగా ఉదయం అల్పాహారం అందించేందుకు సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అదిరే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Telangana Students
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Oct 11, 2025 | 4:18 PM

Share

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు శుభవార్త. రాబోయే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం మరో సంక్షేమపథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా, ఇప్పుడు పిల్లలకు ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు విద్యాశాఖ అడుగులు ముందుకు వేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించినట్లుగా, తమిళనాడు నమూనాలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఉదయం అల్పాహార పథకం’ అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అధికారులు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 17.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ అల్పాహారం అందించాలంటే సంవత్సరానికి సుమారు రూ. 400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. కేవలం ఆహార ఖర్చు రూ. 360 కోట్లు కాగా, వంటసామాగ్రి, గ్యాస్‌ పొయ్యిలు, నిర్వహణ తదితర అంశాలతో కలిపి మొత్తం ఖర్చు రూ. 400 కోట్ల వరకు చేరుతుందని లెక్కలు చూపుతున్నాయి.

బ్రేక్ ఫాస్ట్ మెనూలో వారానికి మూడు రోజులు అన్నంతో పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడీ లాంటి వంటకాలు ఉంటాయి. మిగతా రెండు రోజులు ఉప్మా, రవ్వ కిచిడీ వంటి అల్పాహార పదార్థాలు అందించాలని అధికారులు ప్రతిపాదించారు. సగటున ఒక్క విద్యార్థి అల్పాహారానికి రోజుకు రూ. 10 ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. రోజుకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని పరిగణనలోకి తీసుకుంటే, రోజువారీ వ్యయం రూ. 1.6 కోట్లు అవుతుంది.

ప్రస్తుతం మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు రూ. 3 వేలు వేతనం పొందుతున్నారు. కొత్త పథకం అమలులోకి వచ్చిన తర్వాత వారి పనిభారం పెరిగే అవకాశం ఉన్నందున, వేతనాన్ని రూ. 500 పెంచే ప్రతిపాదనను కూడా విద్యాశాఖ ప్రభుత్వం ముందుంచింది.

ఈ పథకం ద్వారా విద్యార్థుల అడ్మిషన్లు, హాజరు శాతం గణనీయంగా పెరగవచ్చని అధికారులు నమ్ముతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఇది ఒక పెద్ద ఊరటగా మారనుంది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ఈ ఉదయం అల్పాహారం పథకం 2025 జూన్‌ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమవనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
క్లాస్‌లో హాయిగా నిద్రపోయిన ప్రభుత్వ బడి టీచర్‌.. వీడియో
క్లాస్‌లో హాయిగా నిద్రపోయిన ప్రభుత్వ బడి టీచర్‌.. వీడియో
స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు
స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు
ఆహారమే కాదు.. ఈ చిట్కాలతో కూడా తల్లికి వెంటనే పాలు పడతాయి!
ఆహారమే కాదు.. ఈ చిట్కాలతో కూడా తల్లికి వెంటనే పాలు పడతాయి!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఈ విషయం తెలియకుండా వెళ్తే..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఈ విషయం తెలియకుండా వెళ్తే..
భారతీయులు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఎందుకు తింటారో తెలుసా
భారతీయులు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఎందుకు తింటారో తెలుసా
అఫీషియల్.. అప్పుడే OTTలో తిరువీర్, ఐశ్వర్యరాజేష్‌ల కొత్త సినిమా
అఫీషియల్.. అప్పుడే OTTలో తిరువీర్, ఐశ్వర్యరాజేష్‌ల కొత్త సినిమా
దోసకాయతో ఇలా పచ్చడి చేసి వేడి అన్నంలో తింటే.. రుచి అదిరిపోద్ది
దోసకాయతో ఇలా పచ్చడి చేసి వేడి అన్నంలో తింటే.. రుచి అదిరిపోద్ది
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌
చెల్లికి అనుకుంటే నేనే పెళ్లి చేసుకున్నా..
చెల్లికి అనుకుంటే నేనే పెళ్లి చేసుకున్నా..
టీమిండియాకు అలాంటి ప్లేయర్ మళ్లీ దొరకడు: రవిశాస్త్రి
టీమిండియాకు అలాంటి ప్లేయర్ మళ్లీ దొరకడు: రవిశాస్త్రి
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!