AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana MLAs: ఎమ్మెల్యేల బేరసారాల ఎపిసోడ్‌పై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

ఫామ్‌హౌస్‌లో కొనుగోళ్ల వ్యవహారంలో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేశారు. సీక్రెట్‌ ప్లేస్‌లో లోతుగా విచారించారు. ప్రధానంగా డీల్‌ వెనుక ఉన్న బిగ్‌ షాట్స్‌ ఎవరన్న కోణంలో ప్రశ్నించారు.

Telangana MLAs: ఎమ్మెల్యేల బేరసారాల ఎపిసోడ్‌పై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు
Telangana Mlas
Sanjay Kasula
| Edited By: |

Updated on: Oct 27, 2022 | 11:16 PM

Share

యావత్‌ తెలంగాణ ఫామ్ హౌజ్‌ పాలిటిక్స్‌ను ఆసక్తిగా గమనిస్తోంది. గంటలు గడిచేకొద్దీ రాజకీయ నేతల గుండెల్లో వేగం పెరుగుతోంది. ఎప్పుడెవరు ఎలాంటి బాంబు పేల్చుతారోనన్న దడ మొదలైంది. అనూహ్య పరిణామాల మధ్య ఫామ్‌హౌజ్‌ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. డీల్‌లో భాగంగా తన ఫామ్‌హౌస్‌కు ముగ్గురు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. బీజేపీలో చేరేందుకు కోట్ల రూపాయలు ఆఫర్‌ చేశారని, ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి 50కోట్లు ఇస్తామని డీల్‌ మాట్లాడారన్నారు. బీజేపీలో చేరాలని స్వామీజీ, నందు, సతీష్‌ తనపై ఒత్తిడి తెచ్చారని పోలీసులకు కంప్లయింట్‌ చేశారు.

సీబీఐ, ఈడీలతో దాడులంటూ బెదిరింపులు

మాట వింటే సరి లేదంటే.. సీబీఐ, ఈడీ లతో దాడులు జరుగుతాయని బెదిరించారని కంప్లైంట్‌లో ప్రధానంగా మెన్షన్ చేశారు రోహిత్‌. ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1 గా ఢిల్లీకి చెందిన సతీశ్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి.. ఏ 2 హైదరాబాద్‌కు చెందిన నందకిశోర్‌.. ఏ 3గా తిరుపతికి చెందిన సింహయాజిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కోనుగోల్‌మాల్‌ వెనుక ఉన్నదెవరు?

ఎమ్మెల్యేల బేరసారాల ఎపిసోడ్‌పై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. భారతి, నందు, సింహయాజిలను రహస్య ప్రాంతానికి తరలించారు. కోనుగోల్‌మాల్‌ వెనుక ఎవరున్నారనే కోణంలో ప్రధానంగా ఆరాతీశారు. ముగ్గుర్ని కలిపి ఓసారి.. వేర్వేరుగా మరోసారి విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఫామ్‌హౌస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని పరిశీలించారు. ఇతరులెవర్నీ లోనికి అనుమతించలేదు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఫామ్‌ హౌస్‌కు డబ్బు తెచ్చారా? తెస్తే ఎక్కడ దాచారనే కోణంలో తనిఖీలు చేశారు.

ముగ్గురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను విశ్లేషించారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..