Telangana Municipal Mayor Elections 2026 Live: ఊహించని ఎత్తులు.. పొత్తులు.. కరీంనగర్ మేయర్ ఎన్నికలో ట్విస్టుల మీద ట్విస్టులు
Telangana Municipal Mayor, Chairman Elections 2026 Live updates in Telugu: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓటర్లు ఇచ్చిన తీర్పుతో పలుచోట్ల హంగ్ ఏర్పడటంతో.. ఇప్పుడు అందరి దృష్టి చైర్మన్ పీఠాలపైనే పడింది. క్యాంపు రాజకీయాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో మేయర్, చైర్మన్ ఎన్నిక ఉత్కంఠను రేపుతున్నాయి.

LIVE NEWS & UPDATES
-
తొర్రూర్లో హైటెన్షన్
- తొర్రూర్ మున్సిపాలిటీ దగ్గర హైటెన్షన్
- పోటాపోటీగా మోహరించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు
- రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట
- మున్సిపల్ ఆఫీస్కు వచ్చిన మాజీమంత్రి ఎర్రబెల్లి
- ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ కార్యకర్తల దాడితో ఉద్రిక్తత
- ఎర్రబెల్లిని అక్కడినుంచి పంపించేసిన పోలీసులు
- అదనపు బలగాలను రప్పిస్తోన్న పోలీసులు
-
కరీంనగర్ మేయర్ ఎన్నికలో ట్విస్టులు..
- కరీంనగర్ మేయర్ ఎన్నికలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు
- మేయర్ ఎన్నికలో పాల్గొనకూడదని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం
- మేయర్ ఎన్నికపై కాంగ్రెస్, ఎంఐఎం సైలెంట్ ఉంటే ఎన్నిక కష్టమే..
- కోరం లేకపోతే మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం.
- మేయర్ బరిలో తాము ఉన్నామని ప్రకటించిన మంత్రి పొన్నం
-
-
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం..!
- కామారెడ్డి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కుదిరిన సయోధ్య
- చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను పంచుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
- చైర్పర్సన్గా కాంగ్రెస్ కూటమిలోని ఉమరాణి
- 38వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్లో చేరిన ఉమారాణి
- వైస్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ 12వ వార్డు అభ్యర్థి కాసర్ల గోదావరి
- అధికారికంగా ఎన్నిక జరిగే వరకు గోప్యంగా ఉంచుతున్న నేతలు
-
ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్..
- ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో హై టెన్షన్ నెలకొంది.
- మున్సిపాలిటీ కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు రచించాయి.
- రహస్య క్యాంపుల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేరుగా మున్సిపాలిటీకి చేరుకున్నారు.
- ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి సమావేశానికి చేరుకున్నారు.
- మరోవైపు.. ఇబ్రహీంపట్నంలో ఇద్దరు కార్పొరేటర్లు కిడ్నాప్ అయ్యారు.
- కాంగ్రెస్ రెబల్ కార్పొరేటర్ ఒకరు.. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరు కిడ్నాప్ అయినట్లు ఫిర్యాదు
-
మెదక్ జిల్లాలో ఉత్కంఠ..
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ
- 4 రోజులుగా క్యాంపులో మకాం వేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
- నేరుగా మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొననున్న కౌన్సిలర్లు
- మున్సిపల్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు
- ఇస్నాపూర్, జిన్నారం, కోహిర్, జహీరాబాద్..
- మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్
- నర్సాపూర్, జిన్నారం, మెదక్ మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికలో బీజేపీ కింగ్ మేకర్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పదవి ఆఫర్ చేసినా..
- చైర్మన్ సీటు కోసమే పట్టుబడుతున్న కమలనాథులు
-
-
కౌన్ బనేగా భైంసా బాద్ షా
- కౌన్ బనేగా భైంసా బాద్ షా
- భైంసాలో బీజేపీ Vs ఎంఐఎం
- స్వతంత్ర అభ్యర్థికే భైంసా ఛైర్మన్ పదవి?
- భైంసాలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే రామారావు పటేల్
- ఎంఐఎం రెబల్గా పోటీచేసిన ఇద్దర్లో ఒకరికి చైర్మన్ పదవి ఆఫర్
- చివరి నిమిషంలో షాక్ ఇస్తామంటున్న ఎంఐఎం
- ఇప్పటికైతే ఎవరికీ దక్కని స్పష్టమైన మెజార్టీ
-
ఎంఐఎం కౌన్సిలర్ మిస్సింగ్ కలకలం
- కాగజ్ననగర్లో ఎంఐఎం కౌన్సిలర్ మిస్సింగ్ కలకలం
- తమ అభ్యర్థి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంఐఎం
- బీఆర్ఎస్ కిడ్నాప్ చేసిందంటూ చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీఖాన్ ఫిర్యాదు
- 3వ వార్డు నుంచి గెలిచిన ఎంఐఎం అభ్యర్థి ఆలియా బేగం
- కాగజ్నగర్ పీఠం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ రాజకీయాలు
-
-
రాత్రికి రాత్రి మారిన బెల్లంపల్లి రాజకీయ సమీకరణలు
- రాత్రికి రాత్రి మారిన బెల్లంపల్లి రాజకీయ సమీకరణలు
- చివరి నిమిషంలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన స్వతంత్రులు
- స్వతంత్రుల మద్దతు కూడగట్టి పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్
- 34 స్థానాలకు చెరో 14 సీట్లు గెలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్
- స్వతంత్రులు 5, ఒక బీజేపీ అభ్యర్థి గెలుపు
- కేటీఆర్ సమక్షంలో మూడు రోజుల క్రితం BRSలో చేరిన..
- ఇద్దరు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్
- చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరిన ఆ ముగ్గురు
తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్ల ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. సుమారు మున్సిపల్ ఎన్నికల్లో 30కిపైగా స్థానాల్లో హంగ్ రావడంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు తెరలేపాయి. ఫలితాలు వచ్చిన వెంటనే కౌన్సిలర్లను పార్టీలు క్యాంపులకు తరలించాయి. క్యాంపుల నుంచి నేరుగా చైర్మన్ ఎన్నిక సమావేశానికి కౌన్సిలర్లు హాజరకానున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠను రేపుతుండగా.. నిజామాబాద్లో అత్యధిక స్థానాలు వచ్చిన బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంటామని ప్రకటించింది. కరీంనగర్లో కాంగ్రెస్కు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఇతర పార్టీలతో కలిసి బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ ఆఫీషియో ఓట్లతో గట్టెక్కాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్స్ అఫీషియో ఓట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు ఏ మున్సిపాలిటీలో ఉంటే అక్కడే ఓటుకు అవకాశం ఇస్తామని స్పష్టం చేసింది. గతంలో ఎమ్మెల్సీలు తమకు నచ్చిన మున్సిపాలిటీలో ఓటు వేసేవారు.ఇప్పుడు స్థానిక ఓటు లేకపోతే ఎక్స్ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదు. ఈ నెల 14 తోనే ఎక్స్ అఫీషియో ఓటు రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది.
Published On - Feb 16,2026 9:54 AM




