AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabitha Indra Reddy: హైటెక్ సిటీ ఒక్కటి కడితే.. హైదరాబాద్ అభివృద్ధి అయినట్టా.. చంద్రబాబుపై తెలంగాణ మంత్రి ఫైర్..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఖమ్మం మీటింగ్ లో చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. హైటెక్ సిటీ ఒక్కటి కట్టినంత మాత్రాన అభివృద్ధి అంతా చంద్రబాబు చేశారా...

Sabitha Indra Reddy: హైటెక్ సిటీ ఒక్కటి కడితే.. హైదరాబాద్ అభివృద్ధి అయినట్టా.. చంద్రబాబుపై తెలంగాణ మంత్రి ఫైర్..
Sabitha Indra Reddy
Ganesh Mudavath
|

Updated on: Dec 22, 2022 | 5:51 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఖమ్మం మీటింగ్ లో చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. హైటెక్ సిటీ ఒక్కటి కట్టినంత మాత్రాన అభివృద్ధి అంతా చంద్రబాబు చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణలో అందరూ ప్రశాంతంగా ఉన్నారని, పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ డైరెక్షన్ లోనే చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారన్న ఆమె.. కరోనా సమయంలో హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఒక్క గల్లీలో అయినా తిరిగారా అని నిలదీశారు. బండి సంజయ్ చెబితే ఈడీ, సీబీఐ వస్తాయని, బీజేపీ డైరెక్షన్ వల్లే దాడులు జరుగుతున్నాయని మంత్రి సబితా ఆరోపించారు. కొవిడ్ పై కేంద్రం ఇచ్చిన గైడెన్స్ మీద హెల్త్ రివ్యూ అనంతరం ఆదేశాలు ఉంటాయని చెప్పారు. సరూర్ నగర్ విద్యార్థుల సమస్యల పై త్వరలోనే పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతోంది. రైతుల పట్ల కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. రైతుకు మేలు చేయాలనే ఆలోచన కేసీఆర్ ది. రైతులను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణపై కక్ష కట్టి వరి కొనకుండా వివక్ష చూపారు. ఉపాధి హామీ నిధులు దారి మళ్లిస్తున్నామని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు కళ్లాలు కడితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి. రోడ్డెక్కి ధర్నాలు చేస్తే తప్ప మోడీకి వినిపించనట్లు ఉంది. అందుకే రేపు ( శుక్రవారం ) అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం.

– సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. తెలంగాణలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తాను ఫౌండేషన్‌ వేయకపోతే హైదరాబాద్‌ ఇంత అభివృద్ధి అయ్యేదా అని ప్రశ్నించారు. తెలంగాణలోనూ టీడీపీ బలంగా ఉండాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మళ్లీ భవిష్యత్ లో కలిసే అవకాశమే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీకి చెందిన నేతల మాటల ఎదురు దాడులతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?