Minister KTR: నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..

|

Apr 14, 2021 | 8:19 AM

Minister KTR: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే

Minister KTR: నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..
KTR
Follow us on

Minister KTR: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే బుధవారం నాడు ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జడ్చర్ల, అచ్చంపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. జడ్చర్లలో 5.05 కోట్ల వ్యయంతో నిర్మించిన మినీ ట్యాంక్‌ బండ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కావేరమ్మపేటలో నిర్మించిన డబుల్ బెడ్‌ రూమ్‌లను ఆయన పరిశీలించనున్నారు. అనంతర అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి అచ్చంపేటకు మంత్రి కేటీఆర్ బయలుదేరుతారు. అచ్చంపేటలో తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేస్తారు. అనంతరం అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అగ్రికల్చర్ మార్కెట్‌కి, స్మృతి వనం, కూరగాయల మార్కెట్‌కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత అక్కడ పబ్లిక్ మీటింగ్‌లో ఆయన పాల్గొంటారు.

Also read:

మరో వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే.. అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు.. మూడోసారి అజ్ఞాతంలోకి..

Petrol and Diesel Price Today: చమురు ధరల్లో స్వల్ప మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Summer Makeup Tips: సమ్మర్ సీజన్ లో పెళ్లిళ్ల సందడి మొదలు. అయితే మేకప్ కరిగిపోకుండా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి..