AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: యాసంగి పంట కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక సమావేశం

Telangana CM KCR: యాసంగి పంట కొనుగోలు చేస్తామని ఇదివరకే సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు..

CM KCR: యాసంగి పంట కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక సమావేశం
Subhash Goud
|

Updated on: Apr 19, 2022 | 7:09 PM

Share

Telangana CM KCR: యాసంగి పంట కొనుగోలు చేస్తామని ఇదివరకే సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే యాసంగి పంట కొనుగోలు చేస్తామని ఇటీవల ప్రకటించిన కేసీఆర్‌.. దానికి సంబంధించి మంత్రులు, అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. పత్తి, మిర్చి, కంది, వాటర్ మిలన్ తదితర ప్రత్యామ్న్యాయ పంటల సాగును ప్రోత్సహించాలని కేసీఆర్‌ అన్నారు.

ఎరువుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించాలి:

ఇక విపరీతమైన ఎరువులు, పురుగుమందుల వాడకం తో భూములు పాడవుతాయన్న కేసీఆర్.. రానున్న వానాకాలం సీజన్‌లో అందుబాటులో ఉంచాల్సిన డీఏపీ, యూరియా తదితర ఎరువుల నిల్వలపై ఆరా తీశారు. వర్షాకాలంలో సాగు చేసే పంటపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లు తీరుతెన్నుల‌ను కూడా సీఎం చర్చించారు. వర్షాకాలం పంటకు సంబంధించి రైతుబంధు గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Governor Tamilisai: సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకంచేయడానికి.. నేను రబ్బర్‌ స్టాంప్‌ గవర్నర్‌ని కాదు..

CM YS Jagan: ముస్లింలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇఫ్తార్‌ విందు ప్రకటన.. ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం..!