AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: బీజేపీకి మళ్లీ షాక్‌.. వరంగల్‌ సభకు అనుమతి నిరాకరణ.. అసలేమైందంటే..?

ఆగ్రహం వ్యక్తం చేసిన కమలం శ్రేణులు.. అర్ధరాత్రి ఏసీపీ ఆఫీస్‌ను ముట్టడించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పాడింది. పోలీసుల కక్ష్య సాధింపేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

Telangana BJP: బీజేపీకి మళ్లీ షాక్‌.. వరంగల్‌ సభకు అనుమతి నిరాకరణ.. అసలేమైందంటే..?
Bandi Sanjay
Shaik Madar Saheb
|

Updated on: Aug 26, 2022 | 7:00 AM

Share

Telangana BJP: బీజేపీకి మరో షాక్‌ తగిలింది. హన్మకొండలో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న కాషాయం పార్టీ నోట్లో ఎలక్కాయ పడినట్లయింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్‌ ఇవ్వేలేమని ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు చెల్లించిన రెంట్‌ను కూడా వెనక్కు ఇచ్చేశారు. అయితే.. ఈ ఇష్యూపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమలం శ్రేణులు.. అర్ధరాత్రి ఏసీపీ ఆఫీస్‌ను ముట్టడించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పాడింది. పోలీసుల కక్ష్య సాధింపేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సభ అనుమతిపై కూడా బీజేపీ ఇవాళ హైకోర్టులో కేసు వెయ్యనున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఈనెల 27న ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్​కాలేజీలో బీజేపీ భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఆయితే ఈ సభకు పోలీసు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. పోలీసుల పర్మిషన్‌ లేనందున తాము కూడా సభకు కాలేజీ గ్రౌండ్‌ ఇవ్వలేమని లెటర్‌ విడుదల చేసింది యాజమాన్యం. అయితే ఇప్పటికే పోలీసులు అడ్డుకోవడంతో వాయిదా పడిన ప్రజాసంగ్రామ యాత్రకు నిన్న హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు.. అనుమతి నిరాకరణపై మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

సభ ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతి రద్దు చేయడం సరికాదని బీజేపీ నేత మనోహర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బహిరంగ సభ అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామని మనోహర్‌రెడ్డి వెల్లడించారు. బీజేపీకి వస్తున్న స్పందనకు భయపడే సభకు అనుమతి నిరాకరించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి ఆరోపించారు. ఆరు నూరైనా సభ నిర్వహించి చూపిస్తామని సవాల్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో యాత్రకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో జనగాం సమీపంలోనే యాత్ర రద్దు చేసి.. ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆ తర్వాత యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ పార్టీ కోర్టులో పిటిషన్‌ వేసింది. విచారించిన కోర్టు యాత్రకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఈ యాత్ర మళ్లీ మొదలుకానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి