AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ఉన్నది వీరేనా..? హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకుందా ?.. ఏ క్షణమైన దీనిపై ఢిల్లీ నాయకత్వం ప్రకటన చేసే అవకాశం ఉందా ?.. ఇప్పటికే ఈ అంశంపై అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన ఆ పార్టీ అగ్రనేతలు.. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చేశారా ?.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి ఎందుకు వెళ్లారు.. పూర్తి వివరాలను తెలుసుకోండి..

Telangana BJP: తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ఉన్నది వీరేనా..? హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి..
Telangana Bjp
Shaik Madar Saheb
|

Updated on: Mar 24, 2025 | 8:30 AM

Share

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలకుగానూ 2 సీట్లును గెలుచుకుని తమ రాజకీయ బలాన్ని మరింతగా పెంచుకుంది. ఈ క్రమంలోనే చాలాకాలంగా పెండింగ్‌లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియమాకాన్ని కూడా పూర్తి చేసి మరింత దూకుడుగా తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు.

హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి

ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగానూ కొనసాగుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. కానీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే సమయం దగ్గరపడిందని.. అతి త్వరలోనే దీనిపై ప్రకటన రావొచ్చనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఈ అంశంపైనే పార్టీ పెద్దలతో చర్చిస్తారని.. కిషన్ రెడ్డితో చర్చించిన తరువాత కొత్త అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన రావొచ్చనే ప్రచారం సాగుతోంది.

అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని కొత్త చీఫ్ ఎంపిక

తెలంగాణ బీజేపీ కొత్త బాస్ ఎంపికపై ఇప్పటికే పలు దఫాలుగా నేతల అభిప్రాయాలను సేకరించింది బీజేపీ నాయకత్వం. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీజేపీని మరింత దూసుకెళ్లేలా కొత్త నాయకత్వం ఎంపిక ఉండాలని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటూనే.. రాష్ట్రంలోని నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే నాయకుడికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.

క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి నేతల పేర్లు అధ్యక్ష రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తాను పార్టీ అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ అంశంలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈటల రాజేందర్ చెబుతూ వస్తున్నారు. ఈసారి తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయని.. వాటిని మరింత మెరుగుపరిచేలా కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉండాలని కసరత్తు చేస్తోంది. అయితే కేవలం కొత్త అధ్యక్షుడి ఎంపికతో పార్టీ నాయకత్వం సరిపెడుతుందా ? పార్టీలో మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయా ? అనే అంశం కూడా ఆసక్తిరేపుతోంది.

రేసులో ఉన్నది వీరేనా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు షార్ట్ లిస్ట్ అయినట్టు సమాచారం.. అయితే.. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల పరిశీలకురాలుగా ఉన్న శోభా కరంద్లాజే ఇప్పటికే రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్